బండ్లగూడ, జూన్ 11: నాయీ బ్రాహ్మణ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండటం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు ఉచిత విద్యుత్ను వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ భవన్లో శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ను కలిసి తమ గోడును విన్నవించారు. ఇందుకు, మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందించి నాయీ బ్రాహ్మణులు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, వీలైతే దుకాణం ఫొటోను జత చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలపడంతో నాయీ బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేశారు.