అమరావతి : కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గున్తోటి వెంకట సుబ్బయ్య (62) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
వెంకటయ్య సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. బద్వేల్లోని వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం నింపారు.
2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన వెంకట సుబ్బయ్య టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్పై 44 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఇంటర్ చదువుతుండగా, కుమార్తె ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.
డాక్టర్ వెంకట సుబ్బయ్య స్వస్థలం కడప జిల్లా బద్వేలు మండలంలోని మల్లెలవారిపల్లి. వెంకట సుబ్బయ్య మృతిపట్ల పలువురు మంత్రులు, ఎమ్మెల్యే కడప జిల్లా వైసీపీ శ్రేణులు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి.