ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు ఎన్ని? (సి) ఎ) 7 బి) 8 సి) 9 డి) 10 వివరణ: ప్రస్తుతం తొమ్మిది దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల (అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా)తో పాటు భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తరకొరియా దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. అణుయుద్ధాలు ఎప్పటికీ జరగకుండా నివారించాలని, ముందు ముందు అణ్వాయుధ వ్యాప్తిని నిలువరించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని అయిదు శాశ్వత సభ్యదేశాలు జనవరి 3న తీర్మానించాయి.
పంజాబ్లో ప్రధాని పర్యటన సమయంలో భద్రతా వైఫల్యానికి సంబంధించి సుప్రీంకోర్ట్ ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది? (బి) ఎ) అజిత్ ధోవల్ బి) ఇందుమల్హోత్ర సి) కున్వర్ సింగ్ డి) అభిజిత్ వివరణ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఉండగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అర్ధాంతరంగా పర్యటనను రద్దు చేసుకొని అక్కడి నుంచి నిష్క్రమించారు. దీంతో సుప్రీంకోర్ట్ విచారణ చేపట్టింది. ఇది నిజంగా భద్రతా వైఫల్యామా? కాదా? అన్న అంశాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్ట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి రిటైర్డ్ జడ్జి ఇందుమల్హోత్ర నేతృత్వం వహించనున్నారు. ఇందులో మరో ఇతర సభ్యులు.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, చండీగఢ్ డైరెక్టర్ జనరల్, పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, పంజాబ్-హర్యానా హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్. భద్రతా వైఫల్యానికి కారణాలను ఈ కమిటీ నిర్ధారిస్తుంది. ప్రధానితో పాటు ఇతర రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వారి భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ కమిటీ వివరిస్తుంది.
‘మిషన్ అమానత్’ను ప్రారంభించింది ఎవరు? (సి) ఎ) కేంద్ర రక్షణ శాఖ బి) కేంద్ర పర్యాటక శాఖ సి) రైల్వే శాఖ డి) కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వివరణ: ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీ, ఇతర వస్తువులను కనుగొనేందుకు భారత రైల్వే మిషన్ అమానత్ను ప్రారంభించింది. దీనిని రైల్వే రక్షణ దళం అందుబాటులోకి తెచ్చింది. పోగొట్టుకున్న వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లో నమోదు చేస్తారు. పశ్చిమ రైల్వే జోన్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ పద్ధతిలో రూ.2.58 కోట్ల విలువ అయిన వస్తువులను గుర్తించగలిగారు. 1317 మంది ప్రయాణికులు లబ్ధిపొందారు. రైల్వేల ఆస్తి, ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళాన్ని 1957లో ఏర్పాటు చేశారు.
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (డి)
ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థులకు వర్తిస్తుంది
ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది
ఎన్నికల వ్యయ పరిమితిని నిర్ణయించేది భారత ఎన్నికల సంఘం ఎ) 2, 3 బి) 2 సి) 3 డి) 1, 3 వివరణ: ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు చేసే వ్యయంపైన పరిమితులు ఉంటాయి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. అయితే రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఇటీవల కాలంలో ఎన్నికల వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. ఇవి పెద్ద, చిన్న రాష్ర్టాలకు వేర్వేరుగా ఉంటాయి. పెద్ద రాష్ర్టాల్లో శాసన సభ ఎన్నికలకు పోటీ పడేవాళ్లు గతంలో రూ.70 లక్షల వరకు మాత్రమే వ్యయ పరిమితి ఉండగా, ఇప్పుడు దానిని రూ.95 లక్షలకు పెంచారు. శాసనసభ్యుల వ్యయం రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచారు. చిన్న రాష్ర్టాల్లో లోక్సభ అభ్యర్థులకు రూ.54 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచగా, ఇవే రాష్ర్టాల్లో శాసనసభకు పోటీ పడే అభ్యర్థుల వ్యయాన్ని రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షలకు పెంచారు.
భరత్ సుబ్రమణియం ఏ క్రీడతో ముడిపడి ఉన్నాడు? (ఎ) ఎ) చెస్ బి) స్వాష్ సి) క్రికెట్ డి) హాకీ వివరణ: భరత్ సుబ్రమణియం చెస్ క్రీడాకారుడు. భారత్ నుంచి 73వ గ్రాండ్ మాస్టర్. ఇటలీలో నిర్వహించిన వెర్గాని కప్ను 14 సంవత్సరాల సుబ్రమణియం గెలిచాడు. భారత్ తరఫున 71వ గ్రాండ్ మాస్టర్గా సంకల్ప్ గుప్తా, 72వ గ్రాండ్ మాస్టర్గా మిత్రభగుహ నిలిచారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఇచ్చిన ఏ తీర్పుకు సంబంధించి భారత్ మళ్లీ అప్పీలు చేసింది? (సి) ఎ) భారత్ను అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల జాబితాలోకి మార్చడం బి) చైనాను అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల జాబితాలోకి మార్చడం సి) చక్కెర, చెరకు లకు ఇస్తున్న రాయితీలు డి) రక్షణ రంగ ఉత్పత్తులపై ఇస్తున్న రాయితీలు వివరణ: చక్కెర, చెరకు పంటలకు సంబంధించి భారత్ ఇస్తున్న రాయితీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) గతంలో తీర్పు చెప్పింది. దీనిని పునఃపరిశీలించాలని భారత్ అప్పీలు చేసింది. భారత్కు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసిన దేశాలు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, గౌతమేల. చెరకు ఉత్పత్తితో పాటు ఎగుమతులకు భారత్ ఇస్తున్న ప్రోత్సాహం వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటు ఆ దేశాలు ఫిర్యాదు చేశాయి. నిజానికి 10% మించి సబ్సిడీలు ఉండరాదన్నది నిబంధన. భారత్ అంతకు మించి ఇస్తున్నదని ఆ దేశాలు ఆరోపించాయి.
ఏఐఐబీకి వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన భారతీయుడు ఎవరు? (డి) ఎ) రఘురాం రాజన్ బి) రంగరాజన్ సి) బిమల్ జలాన్ డి) ఉర్జిత్ పటేల్ వివరణ: చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్ (ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్-ఏఐఐబీ)కు వైస్ ప్రెసిడెంట్గా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. ఫిబ్రవరి 1, 2022లో ఆయన బాధ్యతలు స్వీకరించి, మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఈ బ్యాంక్లో అయిదుగురు వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు. అందులో ఉర్జిత్ పటేల్ కూడా ఒకరు. ఈ బ్యాంక్ను 2016 జనవరిలో ఏర్పాటు చేశారు. చైనా అత్యధిక వాటాదారుగా ఉండగా, రెండో అతిపెద్ద వాటాదారు భారత్. ప్రస్తుతం ఇందులో 104 దేశాలు ఉన్నాయి
కృత్రిమ సూర్యుడిని చేపట్టే దిశగా ఏ దేశం ప్రయోగాలను చేపట్టింది? (ఎ) ఎ) చైనా బి) ఫ్రాన్స్ సి) ఆస్ట్రేలియా డి) దక్షిణ కొరియా వివరణ: కృత్రిమ సూర్యుడిని సృష్టించే దిశగా చైనా చేపట్టిన ప్రయోగాలు విజయవంతం అవుతున్నాయి. సూర్యుడి కోర్ భాగంలో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ప్రస్తుతం చైనా అంతకున్నా అయిదు రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతను ఇచ్చేలా కృత్రిమ సూర్యుడిని సృష్టించింది. ఇందులో 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను 1,056 సెకన్ల పాటు రియాక్టర్ను పని చేయించింది. ఇంత సుదీర్ఘకాలం అధిక ఉష్ణోగ్రత ప్లాస్మా ఆపరేషన్ కొనసాగడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఈ ప్రయోగం వల్ల పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది.
హర్ప్రీత్ చండీ వార్తల్లో నిలవడానికి కారణం? (సి) ఎ) ఇంటర్నేషనల్ స్పేస్క్రాఫ్ట్కు ఎంపికయిన తొలి భారతీయురాలు బి) అమెరికాలోని ఫెడరల్ కోర్ట్లో జడ్జిగా ఎంపికయ్యారు సి) దక్షిణధృవాన్ని చేరుకున్నారు డి) అంటార్కిటికాకు వెళ్లే శాస్త్రవేత్తల్లో ఆమె ఉన్నారు వివరణ: దక్షిణధృవానికి హర్ప్రీత్ చండీ చేరుకున్నారు. ఈ ఘనత సాధించిన భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం ఆమె బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నారు. ఎవరి సహాయం లేకుండా ఆమె దక్షిణధృవాన్ని చేరుకున్నారు. కాలినడకన అక్కడకు చేరుకున్న తొలి వ్యక్తి ఆమె. దక్షిణధృవానికి చేరుకున్న తొలి వ్యక్తి రోల్డ్ అముండ్సెన్, తొలి భారతీయుడు జేకే బజాజ్.
ప్రపంచంలోనే అతి పొడవైన మెట్రోలైన్ ఉన్న నగరం? (ఎ) ఎ) షాంఘై బి) టోక్యో సి) న్యూయార్క్ డి) సియోల్ వివరణ: ప్రపంచంలో అతి పొడవైన మెట్రోలైన్ ఉన్న నగరం షాంఘై. ఇటీవల ఆ నగరంలో డ్రైవర్ రహిత రెండు మెట్రో లైన్లను అందుబాటులోకి తెచ్చారు. దీంతో మొత్తం ఆ నగరంలో ఈ రైళ్ల ప్రయాణ పొడవు 831 కిలోమీటర్లుగా ఉంది. ఇక్కడ డ్రైవర్ రహిత మెట్రోలైన్ల సంఖ్య కూడా అయిదుకు పెరిగింది.
ద్రవీకృత పెట్రోలియం వాయువు ఇంధన ధర పెంపుతో ఏ దేశంలో తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నారు? (బి) ఎ) ఉజ్బెకిస్థాన్ బి) కజకిస్థాన్ సి) తుర్క్మెనిస్థాన్ డి) కిర్గిజిస్థాన్ వివరణ: వాహనాల్లో వాడే ద్రవీకృత పెట్రోలియం వాయువు ఇంధన ధరలను రెట్టింపు చేయడంతో కజకిస్థాన్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రారంభంలో ధరల పెరుగుదలకు మాత్రమే పరిమితమయిన ఆందోళన, తర్వాత రాజకీయ రూపు సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ దళాలు (సీఎస్టీవో) కజకిస్థాన్కు చేరాయి. గతంలోని సోవియట్లో భాగంగా ఉండి తర్వాత విడిపోయిన ఏడు దేశాలతో రష్యా నేతృత్వంలో 2002లో రూపుదిద్దుకున్నదే సీఎస్టీవో. ఇందులో సభ్యత్వం ఉన్న దేశాలు.. అర్మేనియా, బెలారస్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, రష్యా, తజకిస్థాన్. అఫ్గానిస్థాన్, సెర్బియా ఇందులో పరిశీలక హోదాను కలిగి ఉన్నాయి. ఇతర దేశాల నుంచి సభ్య దేశాలపై జరిగే దాడి నుంచి సీఎస్టీవో రక్షిస్తుంది.
దేశంలో తొలి శిలల ప్రదర్శనశాలను ఎక్కడ ప్రారంభించారు? (సి) ఎ) పుణే బి) గుహావటి సి) హైదరాబాద్ డి) జైపూర్ వివరణ: భారత్లో తొలి శిలల ప్రదర్శన శాల (రాక్గార్డెన్)ను జనవరి 6న హైదరాబాద్లో ప్రారంభించారు. దీనిని జాతీయ భూ భౌతిక పరిశోధన శాల ఏర్పాటు చేసింది. 350 కోట్ల ఏళ్ల కిందటి రాళ్లను మొదలుకొని, ఇటీవల వరకు శాస్త్రవేత్తలు వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించిన శిలలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. నవతరంలో శాస్త్ర, సాంకేతికత పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేందుకు, భారత్లోని శిలలు, పరిశోధనలు తెలుసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.
తస్నిమ్ మీర్ ఏ క్రీడతో ముడిపడి ఉన్నది? ( ఎ) ఎ) బ్మాడ్మింటన్ బి) టెన్నిస్ సి) ఫుట్బాల్ డి) చెస్ వివరణ: ప్రపంచ జూనియర్ బ్మాడ్మింటన్ ర్యాంకింగ్స్లో బారత షట్లర్ తస్నిమ్ మీర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె గుజరాత్ రాష్ర్టానికి చెందిన వ్యక్తి. జనవరి 12న బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన అండర్-19 బాలికల సింగిల్స్ జాబితాలో తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణి ఆమె.
ఇస్రో చైర్మన్ ఎవరు?(బి) ఎ) రాకేశ్ మిశ్రా బి) సోమనాథ్ సి) చిదంబరం పిైళ్లె సి) సుమ భాత్రా వివరణ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్గా డాక్టస్ ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. కేంద్ర కేబినెట్ కమిటీ జనవరి 12న ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సంచాలకుడిగా ఇప్పటి వరకు వ్యవహరించారు. జనవరి 14, 2022 నాటికి ఇస్రో చైర్మన్గా శివన్ పదవీ కాలం ముగిసింది.
జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (సి) ఎ) జనవరి 10 బి) జనవరి 11 సి) జనవరి 12 డి) జనవరి 13 వివరణ: ఏటా జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తారు. స్వామి వివేకానంద జయంతి ఆ రోజు. ఈ ఏడాది ఇతివృత్తం.. ‘ఇట్స్ ఆల్ ఇన్ ది మైండ్ (అంతా మెదడులోనే ఉంది)’. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవంగా 1984లో భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలిసారిగా 1984లో నిర్వహించారు. ఇతివృత్తాలను మాత్రం 2011లో ప్రవేశపెట్టారు. 2011 ఇతివృత్తం ‘సబ్సే పహ్లే భారత్. అంటే అన్నింటికంటే ప్రథమ ప్రాధాన్యం భారత్ అని అర్థం.