1. నేరమయ రాజకీయాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
1) శ్రీకృష్ణ కమిటీ
2) తార్కుండే కమిటీ
3) వోరా కమిటీ
4) దినేష్ గోస్వామి కమిటీ
2. కింది వాటిలో ఏది రిట్ కాదో గుర్తించండి?
1) సెర్షియోరరీ 2) క్విడ్ వారెంటో
3) మాండమస్ 4) కో వారెంటో
3. రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్యపై పరిమితిని ఎవరు నిర్ణయిస్తారు?
1) ముఖ్యమంత్రి
2) శాసనసభ స్పీకర్
3) రాజ్యాంగం 4) గవర్నర్
4. రాజ్యాంగంలోని 279(ఎ) అధికరణం అమల్లోకి వచ్చిన తరువాత ఎంత సమయం లోపల జీఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి?
1) 60 రోజులు 2) 90 రోజులు
3) 120 రోజులు 4) 180 రోజులు
5. పార్లమెంటులో నక్షత్రపు గుర్తు గల ప్రశ్న అంటే ఏమిటి?
1) మౌలిక సమాధానం
అవసరమైన ప్రశ్న
2) ముఖ్యమైన ప్రశ్న
3) రాతపూర్వకమైన సమాధానం
అవసరమైన ప్రశ్న
4) అనుబంధ ప్రశ్నలు లేని ప్రశ్న
6. కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉండే కమిటీ?
1) మహిళా సాధికారత కమిటీ
2) ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
3) అంచనాల కమిటీ
4) పైవేవీకావు
7. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కింది వాటిలో తప్పు సమాధానం గుర్తించండి?
1) ఎన్నికల సంఘం సభ్యులకు ప్రధాన ఎన్నికల అధికారితో సమానమైన
అధికారాలు లేవు
2) ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను ఎన్నికల సంఘం నిర్ణయించదు
3) భారత ఎన్నికల సంఘానికి రాజ్యాంగహోదా ఉంది
4) అన్ని సందర్భాల్లో ఓటర్ల జాబితా సిద్ధంగా ఉంచడం ఎన్నికల
సంఘం బాధ్యత
8. కాకా కాలేల్కర్ సంఘం అంటే ఏమిటి?
1) మొదటి వెనుకబడిన తరగతుల సంఘం
2) రాష్ర్టా పునర్వ్యవస్థీకరణపై మొదటి సంఘం
3) సరిహద్దు వివాదాలపై మొదటి సంఘం
4) చిన్న తరహా పరిశ్రమలపై మొదటి సంఘం
9. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అంబేద్కర్ మృతప్రాయం అని అన్నారు?
1) 356 ఆర్టికల్ 2) 368 ఆర్టికల్
3) 370 ఆర్టికల్ 4) 352 ఆర్టికల్
10. ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జపరడానికి కారణం?
1) మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన రోజు
2) డా. కొట్నిస్ చైనా వెళ్లిన రోజు
3) నేతాజీ జర్మనీ వెళ్లిన రోజు
4) భికాజీ కామా ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చిన రోజు
11. భారత రాష్ట్రపతిని సంబోధించే సరైన విధానం?
1) His Lord Ship
2) His Honour
3) His Highness
4) His Excellency
12. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1) జస్టిస్ టి.ఎస్ ఠాకూర్
2) డి.వై. చంద్రచూడ్
3) జస్టిస్ హెచ్.ఎల్.దత్తు
4) జస్టిస్ జె.ఎస్. ఖేహర్
13. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేసేవారు?
1) 231 2) 230
3) 331 4) 330
14. విధాన సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి కనీసం ఎన్ని ఓట్లు సాధించకపోతే ధరావతు కోల్పోతాడు?
1) లెక్కించిన ఓట్లలో 6వ వంతుకంటే తక్కువ
2) లెక్కించిన ఓట్లలో ఐదో వంతు కంటే తక్కువ
3) లెక్కించిన ఓట్లలో 10వ వంతు కంటే తక్కువ
4) లెక్కించిన ఓట్లలో 8వ వంతు కంటే తక్కువ
15. కింది వారిలో స్థానిక స్వపరిపాలన పితగా పేరు పొందినది ఎవరు?
1) మేయో 2) రిప్పన్
3) మెకాలే 4) కార్న్వాలిస్
16. కింది వారిలో ఏది రాజమన్నార్ కమిటీ సిఫారసు కాదు?
1) అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు
2) ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని ఆరికట్టడం
3) ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను రద్దు చేయడం
4) గవర్నర్ వ్యవస్థను పటిష్ట పరచడం
17. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మనదేశాన్ని ‘ఇండియా’ లేదా ‘భారత్’ అని అభివర్ణించింది?
1) ఆర్టికల్ 3 2) ప్రవేశిక
3) ఆర్టికల్ 2 4) ఆర్టికల్ 1
18. కింది వారిలో రాజ్యాంగ సభకు చెందిన రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు?
1) బి.ఆర్. అంబేద్కర్
2) వల్లభాయ్ పటేల్
3) బాబు రాజేంద్రప్రసాద్
4) జవహర్లాల్ నెహ్రూ
19. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడు స్థాపించబడింది?
1) 1989 2) 1993
3) 1991 4) 1995
20. భారత్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోతే ఎవరు రాజీనామా చేస్తారు?
1) ప్రధానమంత్రి 2) రాష్ట్రపతి
3) ప్రభుత్వం 4) లోక్సభ స్పీకర్
21. రాష్ట్రపతి ఎన్నికకు ఎవరు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు?
1) లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతుల వారీగా
2) లోక్సభ సెక్రటరీ జనరల్
3) రాజ్యసభ సెక్రటరీ జనరల్
4) ప్రధాన ఎన్నికల అధికారి
22. జెర్రీ మాండరింగ్ అంటే ఏమిటి?
1) రాజకీయ ప్రయోజనం కోసం నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించడం
2) బల ప్రయోగం ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడం
3) కుట్ర పూరితంగా దేశాన్ని విభజించడం
4) అక్రమ నగదు బదిలీ చేసే ఒక పద్ధతి
23. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ చట్టం నిర్దారించిన పద్ధతి అనే మాటలను ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో పొందు పరచడం జరిగింది?
1) బ్రిటన్ 2) జపాన్
3) కెనడా 4) ఐర్లాండ్
24. రాజ్యాంగ పరిషత్లో మార్పు చెందే సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించగలిగే సదుపాయం ఉండాలని కోరినవారు ఎవరు?
ఎ) హెచ్.వి. కామత్
2) కె.ఎం. మున్షి
3) శ్యామాప్రసాద్ ముఖర్జీ
4) బి. గోపాలస్వామి అయ్యంగార్
25. పెరెన్స్ పాట్రియే అంటే?
1) తమను తాము రక్షించుకోలేని
పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం
2) రెండు లేదా అంతకంటే ఎక్కువ న్యాయసాధనాల మధ్య అస్థిరత లేదా వైరుధ్యం
3) రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై శాసనాలను చేసే అధికారం పార్లమెంట్కు లేదు
4) పార్లమెంట్ చేసిన శాసనాలను వివరించడం కోర్టుల బాధ్యత
26. జూలై 2016లో భారతదేశంలోని మొదటి ఇ-న్యాయస్థానం (కాగితపు రహిత న్యాయస్థానం) ఏ ఉన్నత న్యాయస్థానంలో ప్రారంభించారు.
1) హైదరాబాద్ 2) ముంబయి
3) ఢిల్లీ 4) బెంగళూరు
27. లోక్సభలో సభ్యుడు కానప్పటికీ, సభా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కింది వారిలో ఎవరికి ఉన్నది?
1) అటార్నీ జనరల్
2) ఉప రాష్ట్రపతి
3) సొలిసిటర్ జనరల్
4) భారత ప్రధాన న్యాయమూర్తి
28. పార్లమెంట్ సందర్భంలో ‘గిలెటిన్’ అంటే ఏమిటి?
1) ఏ చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడం
2) వాకౌట్
3) సభని స్తంభింపచేయడం
4) బడ్జెట్ వ్యయంలో కోత
29. జిల్లా సదర్ న్యాయస్థానాలు, నిజామత్ల స్థానంలో కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో ఉన్నత న్యాయస్థానాలు ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది?
1) 1858 2) 1853
3) 1856 4) 1865
30. భారత చట్టాలను క్రోడీకరించడానికి ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్కు ఎవరు నేతృత్వం వహించారు?
1) మింటో 2) మెకాలే
3) చేమ్స్ఫర్డ్ 4) మార్లే
31. భారత్లో ఓటర్లను నమోదు చేయవలసిన బాధ్యత ఎవరిది?
1) రాష్ట్ర ప్రభుత్వం 2) ఓటర్లు
3) ఎన్నికల సంఘం
4) మున్సిపాలిటీ లేదా పంచాయతీ
32. పార్లమెంట్ ఆమోదం లేకుండా రాష్ట్రపతి పాలన ఎంతకాలం సాగించవచ్చు?
1) మూడు నెలలు
2) ఒక నెల
3) ఆరు నెలలు
4) రెండు నెలలు
43. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఇచ్చే వివిధ అనుమతుల కోసం భారత ఎన్నికల కమిషన్ ఇటీవల ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉపయోగిస్తున్న ఏకగవాక్ష విధానం పేరు ఏమిటి?
1) సువిధ 2) సమాధాన్
3) సుగం 4) అనుమతి
34. జమ్మూ-కశ్మీర్ శాసనసభలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగానికి ఎన్ని శాసనసభ నియోజక వర్గాలు కేటాయించబడ్డాయి?
1) 20 2) 24 3) 28 4) 32
35. డా. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ నిబంధనం రాజ్యాంగ ఆత్మ, హృదయం అని వర్ణించారు?
1) 17 2) 21 3) 32 4) 33
36. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది?
1) 42 2) 43 3) 40 4) 41
37. కింది వాటిలో ఏ దశలో, లోక్సభలో ఒక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది?
1) మూడో పఠనం 2) మొదటి పఠనం
3) రెండో పఠనం 4) నాలుగో పఠనం
38. లోక్సభ విధాన నియామావళిలోని ఏ ఆర్టికల్ ప్రకారం, బడ్జెట్ని 2 లేదా 3 భాగాలుగా ప్రవేశ పెట్టవచ్చు?
1) ఆర్టికల్ 213 2) ఆర్టికల్ 221
3) ఆర్టికల్ 220 4) ఆర్టికల్ 215
39. జనగణన 2001 ఆధారంగా ఏర్పాటైన పార్లమెంట్ నియోజక వర్గాల పరిధి ఏ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి జనగణన వరకు అమల్లో ఉంటుంది?
1) 2021 2) 2026
3) 2015 4) 2022
40. ఏ ఉపరాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి పదవికి రాజీనామా చేశారు?
1) వి.వి. గిరి
2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) జాకీర్ హుస్సేన్
4) ఆర్. వెంకట్రామన్
41. కింది వారిలో ఎవరు రాజ్యాంగపరిషత్లో సభ్యులు కాదు?
1) మహమ్మద్ అలీ జిన్నా
2) కె.ఎం. మున్షీ
3) ఆచార్య కృపలానీ
4) శ్యామాప్రసాద్ ముఖర్జీ
42. రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయడం లేదా రద్దు చేసే విధానం?
1) సాధారణ మెజారిటీతో రాజ్యాంగ సవరణ
2) 2/3వంతు మెజారిటీ రాజ్యాంగ సవరణ
3) రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో ఆమోదించిన తర్వాత పార్లమెంట్ చట్టం ద్వారా
4) నేరుగా పార్లామెంటే సాధారణ మెజారిటీ ద్వారా
43. గిరిజన ప్రాంతాల ఉప ప్రణాళికలో ఏ విధానాన్ని అమలు చేశారు?
1) కింది నుంచి పైకి
2) పై నుంచి కిందికి
3) రంగాల వారీ విధానం
4) ఒక నిర్దిష్ట విధానం