ప్రతిభావంతులైన చురుకైన యువతను దేశ అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్ఠాత్మకమైన అఖిల భారత, కేంద్ర సర్వీసుల్లో నియామకానికి యూపీఎస్సీ ప్రతి ఏటా పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2022 సంవత్సరానికి గత అక్టోబర్లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 9224 అభ్యర్థులకు జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. గత సంవత్సరాలతో పోలిస్తే 2021 నాటి మెయిన్స్లో గమనించదగిన మార్పులు పరిశీలిద్దాం..
జనరల్ ఎస్సే (వ్యాసం)
జనరల్ ఎస్సేలో భాగంగా సెక్షన్-ఎ, సెక్షన్-బి నుంచి ప్రశ్నలను ఎంపిక చేసుకొని 1000-1200 పదాలకు తగ్గకుండా వ్యాసం రాయాలి. సాధారణంగా సెక్షన్ ఎ నుంచి ఫిలాసఫికల్ (తత్వవేత్తల సామెతలు, దార్శనికుల వ్యాఖ్యల నుంచి) సెక్షన్-బి నుంచి సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు శాస్త్ర సాంకేతిక అంశాలు, ఆర్థిక అంశాలు పర్యావరణ, మహిళల సాధికారిత సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు రావడం పరిపాటి. ఈ సంవత్సరం గత సంవత్సరాలకు భిన్నంగా రెండు సెక్షన్ల నుంచి ఫిలాసఫికల్ ధోరణితో ప్రశ్నలు రావడం చెప్పుకోదగ్గ మార్పు. మెయిన్స్ రాసిన అత్యధిక అభ్యర్థులతో ఈ తీరును ఉహించలేదు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి వ్యాసాల నుంచి అభ్యర్థి లోతైన విశ్లేషాణాత్మక, నైతిక థృక్పథాన్ని పరీక్షించేదిగా ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి ఫిలాసఫికల్ వ్యాసాలను రాత్రికి రాత్రే సమాచార సేకరణతో గుర్తుంచుకొని రాసే మూస ధోరణికి స్వస్తి చెప్పి, నూతన వ్యాస విధానానికి యూపీఎస్సీ నాంది పలకనుందని చెప్పవచ్చు.
రాబోయే రోజుల్లో సివిల్ సర్వీసెస్ ఆశావహులు ఈ మార్పులను సున్నిత దృష్టితో పరీక్షించి సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఈ సంవత్సరం అడిగిన ఎస్సే ప్రశ్నలు..
1. The real vational and the rational is real వాస్తవమైనది హేతుబద్ధం, హేతుబద్ధమైనదే వాస్తవం.
2. There are better Practices to ‘Best Practices’ ఉన్న పద్ధతుల నుంచి ఉత్తమమైన పద్ధతుల వైపు
ఇవే కాకుండా మిగతా ప్రశ్నలు కూడా సూటిగా అడగక ఫిలాసఫికల్ ప్రశ్నలతో అభ్యర్థి అవగాహనను, విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని సవాల్ చేసేదిగా 2021 జనరల్ ఎస్సే ఉంది.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ-2022 నోటిఫికేషన్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ-2022
ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎండీ/పీజీ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ/ఎన్బీఎంఎస్ డిప్లొమా
ఎవరు అర్హులు ?
ఎంబీబీఎస్/ప్రొవిజినల్ ఎంబీబీఎస్ పాసైన వారు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
పరీక్ష విధానం: నీట్ పీజీ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష 800 మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్ష కాలవ్యవధి మూడున్నర గంటలు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 4
పరీక్ష తేదీ: మార్చి 7
వెబ్సైట్: https://nbe.edu.in
ఎన్పీటీఐలో..
నాగ్పూర్లోని నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్పీటీఐ)లో కింది ప్రోగ్రామ్స్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు: పీజీ డిప్లొమా (పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్), గ్రాడ్యుయేట్ ఇంజినీర్ కోర్సు (పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్), పోస్ట్ డిప్లొమా కోర్సు (పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్), పోస్ట్ డిప్లొమా కోర్సు (రెన్యువబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ)
అర్హతలు: వేర్వేరు కోర్సులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 15
వెబ్సైట్: https://npti.gov.in