న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పదో తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 19 వరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 12,523 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హవల్దార్, ప్యూన్, డ్రాఫ్టరీ, జమిందార్, జేటీవో, చౌకీదార్, సఫాయివాలా, మాలి వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే ఈ ఏడాది పరీక్ష విధానంలో ఎస్ఎస్సీ కొన్ని మార్పులు చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను 270 మార్కులకు నిర్వహిస్తున్నది. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. హవల్దార్ పోస్టులకు మాత్రం రాత పరీక్షతోపాటు శారీరక దారుఢ్య పరీక్ష కూడా నిర్వహించనున్నారు.
మొత్తం పోస్టులు: 12,523
ఇందులో ఎంటీఎస్ 11,994, హవల్దార్ 529 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. హవల్దార్ పోస్టులకు నిర్ణీత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, హవల్దార్ పోస్టులకు పీఈటీ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 19
పేపర్-1 అడ్మిట్కార్డుల విడుదల: ఏప్రిల్ నెలలో
రాతపరీక్ష: ఏప్రిల్ నెలలో
వెబ్సైట్: www.ssc.nic.in