హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని (Telugu university) పలు కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చని సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ కోట్ల హనుమంతరావు తెలిపారు. ఎంఎఫ్ఏ (చిత్రకళ, శిల్పక ళ), ఎంఏ అప్లైడ్ లింగ్విస్టిక్, ఎంఏ మ్యూజిక్, ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్, ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్, ఎంఏ తెలుగు (రాజమండ్రి ప్రాంగ ణం), ఎంపీఏ డ్యాన్స్ (కూచిపూడి ప్రాంగణం), ఎంఏ హిస్టరీ (శ్రీశైల ప్రాంగణం)తోపాటు పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో సీట్లు మిగిలి ఉన్నందున అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. డిసెంబర్ 7 వరకు రూ.600 డీడీ (రిజిస్ట్రార్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పేరిట)తోపాటు దరఖాస్తును సమర్పించాలని తెలిపారు.