ప్రభుత్వ, పంచాయతీ భూమిని ఆక్రమించుకొన్న వ్యక్తులు ఆయా స్థలాలను తమపేరుతో క్రమబద్ధీకరణ చేయించుకోవడాన్ని ఒక హక్కులా పొందలేరని సుప్రీంకోర్ట్ జనవరి 2021లో తీర్పు చెప్పింది. ప్రభుత్వం తీసుకొనే విధాన పరమైన నిర్ణయం, అందులో నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే క్రమబద్ధీకరణ ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. హర్యానాలోని సోనెపట్ జిల్లా సర్సద్ గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న నివాసితులకు సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువడింది.
భిన్నాభిప్రాయం చెప్పడం దేశ ద్రోహం కాదు ప్రభుత్వ అభిప్రాయానికి అసమ్మతి తెలిపినా, దానికి భిన్నమైంది చెప్పినా దేశ ద్రోహం కాదని మార్చి 3న సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పులో పేర్కొంది. 370 అధికరణ రద్దుపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకు వస్తాయన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం సందర్భంగా ఈ తీర్పు చెప్పింది. కశ్మీర్ను చైనాకు అప్పగించాలంటూ ఫరూఖ్ వ్యాఖ్య చేశారు. సమాన పనికి సమాన వేతనం తాత్కాలిక, శాశ్వత ఉద్యోగి అనే దానితో సంబంధం లేకుండా ఒకే పని చేస్తున్న ప్రతి ఉద్యోగి సమాన వేతనం పొందడానికి అర్హుడు