వచ్చే ఆదాయాన్ని, చేయబోయే వ్యయాన్ని వివరించే నివేదికను బడ్జెట్ అంటారు. ప్రతి కుంటుంబం ఒక బడ్జెట్ను తయారు చేసుకుంటుంది. అది లిఖిత లేదా అలిఖిత కావచ్చు.
వచ్చే ఆదాయాన్ని, చేయబోయే వ్యయాన్ని వివరించే నివేదికను బడ్జెట్ అంటారు. ప్రతి కుంటుంబం ఒక బడ్జెట్ను తయారు చేసుకుంటుంది. అది లిఖిత లేదా అలిఖిత కావచ్చు.
బడ్జెట్పై ధరల ప్రభావం ఉంటుంది. ధరలు పెరిగినప్పుడల్లా బడ్జెట్లోటు ఏర్పడటం లేదా మిగులు తగ్గిపోవటం జరుగుతుంది.
పెరిగిన ధరల ప్రభావం తప్పించుకోవడానికి, వినియోగ వ్యయం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు.
ధరలు పెరిగిన వస్తువుల వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల వారి జీవన ప్రమాణం పడిపోతుంది.
ధరల పెరుగుదల జీవన వ్యయాన్ని పెంచుతుంది. జీవన ప్రమాణాన్ని తగ్గిస్తుంది.
ఈ విధంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. దీర్ఘకాలంలో వస్తుసేవల సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో ఆదాయం మారదు కాబట్టి వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకుంటారు.
ద్రవ్యోల్బణం జీవన ప్రమాణాన్ని తగ్గించి, పేదరికంలోకి నెడుతుంది. సుఖమైన జీవనాన్ని గడపడానికి వారు ఉపయోగించే వస్తుసేవల సంఖ్యపై వారి జీవన ప్రమాణా లు ఆధారపడతాయి.
ద్రవ్యోల్బణ తీవ్ర దుష్ప్రభావానికి లోనయ్యేవారు
స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు చేతిపనివారు చిన్న అమ్మకం దార్లు తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేట్ ఉద్యోగులు రోజువారీ వేతనదారులు చిన్న పరిశ్రమల్లోని కార్మికులు
జీవన ప్రమాణం ఒక కుటుంబానికి, ఒక వృత్తికి, మరొక వృత్తికి, ఒక ఆదాయ వర్గానికి మరొక ఆదాయ వర్గానికి, ఒక దేశానికి మరో దేశానికి నేరుగా ఉంటుంది.
ఉదాహరణకు అమెరికాలో కారు, టెలివిజన్, మొబైల్ ఫోను కలిగి ఉండటాన్ని వారు ఉన్నత జీవనం కలిగి ఉన్నట్లుగా భావించరు. కానీ భారతదేశంలో ఇవి ఉన్నట్లయితే అధిక జీవన ప్రమాణం కలిగి ఉన్నట్లు భావిస్తారు.
డబ్బుతో మనం వాస్తవంగా కొనగలిగిన వస్తుసేవల సంఖ్యను ద్రవ్య కొనుగోలు శక్తి అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ ఆదాయం ద్రవ్యం కొనుగోలు శక్తి పడిపోతాయి.
ద్రవ్యోల్బణ కాలంలో కొనుగోలు శక్తి లేదా డబ్బు విలువ పడిపోతుంది.
ద్రవ్యోల్బణాన్ని టోకు ధరల సూచీ ఆధారంగా లెక్కిస్తారు.
పెరుగుతున్న ధరలు ప్రతి ఒక్కరిపై ఒకే రకమైన ప్రభావాన్ని చూపలేవు. కొన్ని వర్గాల వారిని పెరుగుతున్న ధరల నుంచి మినహాయించాలి.
పెరుగుతున్న ధరల నుంచి మినహాయించాల్సిన వర్గాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు: వీరు పెరిగే ధరలకనుగుణంగా కరువుభత్యం డీఏ పొందుతారు.
ధరలు ఒక శాతం పెరిగితే వారి జీతం కూడా ఒక శాతం పెరుగుతుంది. వీరి ఆదాయం ద్రవ్యోల్బణంతో పాటుగా పెరుగుతుంది.
వ్యాపారులు : వీరు తాము అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యయం రాబట్టుకొంటారు.
ఉదాహరణకు పంచదార ధర పెరిగితే స్వీట్లు అమ్మేవారు, టీ అమ్మేవారు వాటి ధరలను పెంచుతారు.
వివిధ సేవలు అందించేవారు: డ్రై క్లీనర్లు, క్షురకులు, లాయర్లు, డాక్టర్లు మొదలైన వివిధ సేవలను అందించే ప్రజలు ధరలు పెరిగినప్పుడల్లా వారి ఫీజును కూడా పెంచుతారు. ఉదాహరణకు డాక్టర్ రోగుల నుంచి ఎక్కువ ఫీజును వసూలు చేస్తారు.
అధిక ధనవంతులు : వీరిపై ధరల పెరుగుదల ప్రభావం ఉండదు.
కార్పొరేట్ రంగంలో పనిచేసేవారు: వీరిపై కూడా ధరల పెరుగుదల ప్రభావం ఉండదు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన విధంగా పనిచేసే వారందరూ సులభంగా వాటికి పరిహారం పొందలేదు.
వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ధరలు పెరిగాయి కాబట్టి వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తారు.
వేతనాల పెంపుదల కోసం ట్రేడ్ యూనియన్లు కొన్నిసార్లు సమ్మెకు పిలుపునిస్తాయి. అలాంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని యాజమాన్యం కార్మికుల మధ్య వేతన ఒప్పందం కుదిరేవిధంగా చేస్తుంది.
ఒక దినసరి పనివారికి తప్ప మిగిలిన వృత్తులవారందరికి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను నిర్ణీత కాలానికి పెంచుతుంది.
ద్రవ్యోల్బణం కొలవడం ఎలా -వినియోగదారుల సూచిక
కొన్ని వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుంటాయి చిన్న చిన్న వస్తువుల ధరల్లో వచ్చే మార్పులు ద్రవ్యోల్బణంపై చూపే ప్రభావం మొదలైన అంశాలను మనం ధరల సూచీ సంఖ్యల ఆధారంగా అంచనా వేయవచ్చు.
ధరలో వచ్చిన మార్పులను కొలవడానికి ఉపయోగపడే గణాంక సాధనం ధర సూచిక. ధరల సూచికలు కాలక్రమేణా కొన్ని వస్తువుల ధరల మొత్తాల్లో వచ్చిన మార్పులను తెలియజేస్తాయి.
ఏ సంవత్సరంలోని మొత్తం వస్తువులను, మరో సంవత్సరంలో కూడా అదే వస్తువుల ధరలతో పోల్చుతారు.
ఈ విధంగా ఒక కాలవ్యవధి నుంచి మరొక కాలవ్యవధి వస్తు సముదాయం ధరల్లో వచ్చిన మార్పు శాతాన్ని ధరల సూచిక తెలియజేస్తుంది.
గత నెల, గత సంవత్సరం మన కుటుంబ బడ్జెట్ను ఈ సంవత్సరం ఈ నెల బడ్జెట్తో పోల్చవచ్చు. ఈ రెండు సంవత్సరాల ధరల స్థాయిలో ఏ విధంగా మార్పులు వచ్చాయో గమనించవచ్చు.
ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. జ్యోతి గత నెలలో ఇంటిలో ఉపయోగించే నాలుగు వస్తువులపై రూ. 2500 ఖర్చు పెట్టింది.
ఇవే వస్తువుల కోసం ఈ నెలలో 3100 రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే వాటి ధరలు పెరిగాయి. గత నెల కంటే రూ. 600 లు అదనంగా పెరిగాయి. దీన్ని శాతంలో లెక్కిస్తే (600+2500) x 100 = 24 శాతం పెరిగాయి.
మరొక విధంగా చెప్పాలంటే గత నెలలో కుటుంబ వ్యయం రూ.100లు అనుకుంటే ఈ నెలలో రూ. 124.
ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తుసేవల సరాసరి ధరలను ఆధార సంవత్సరం అంటారు. దాన్ని 100 సంఖ్యతో సూచిస్తారు.
ఒకవేళ ఎన్ని ఎంపిక చేసుకున్న వస్తుసేవల ధరలు గత సంవత్సరం కంటే 25 శాతం పెరిగితే ఆ సంవత్సరం ధరల సూచీ సంఖ్య 125 అవుతుంది. దీన్ని ఒక పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
వినియోగదారుల ధరల సూచికలో అనేక రకాలున్నాయి. ఎందుకంటే అనేక కుటుంబాలవారు ఒకేరకమైన వస్తువులు ఉపయోగించరు.
పట్టణ ప్రాంతంలోని పారిశ్రామిక కార్మికులు ఉపయోగించే వస్తుసేవలు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కార్మికులు ఉపయోగించే వస్తుసేవల్లో తేడాలుంటాయి.
భారత ప్రభుత్వం ప్రకటించే వివిధ వినియోగదారుల ధరల సూచికలు.
పారిశ్రామిక ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక
పట్టణ ప్రాంతంలో ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక
వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచిక
వివిధ వినియోగదారుల ధరల సూచికలను ఉపయోగించి కరువుభత్యం (డి.ఎ) లెక్కించి ఉద్యోగులకు ప్రభుత్వం అందజేస్తుంది.
భారత ప్రభుత్వం చట్టాలను అనుసరించి పేదరికాన్ని అంచనా వేయడానికి చట్టపరమైన వేతన రేట్లను పునఃసమీక్షించడానికి వినియోగదారుల ధరల సూచికను వినియోగిస్తుంది.
భారతదేశంలో సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని టోకుధరల సూచికలో వచ్చిన మార్పులను బట్టి లెక్కిస్తారు.
వాస్తవ ఆర్థిక వ్యవస్థలో వేలకొలది వస్తుసేవలు ఉత్పత్తి అవుతాయి. వాటి ధరలు పెరుగుతూ ఉంటాయి. వీటిని ప్రభుత్వం ప్రతినెల లేదా ప్రతివారం అంచనా వేస్తుంది.