హైదరాబాద్: పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు (Scholarships) ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. నూతన, రెన్యువల్ స్కాలర్షిప్స్ కోసం విద్యార్థులు ఈ నెల 21 లోగా ఈ-పాస్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 2021–22 విద్యాసంవత్సరానికి పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, జీఎన్ఎం తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ఇప్పటికీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సౌకర్యార్థం పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ–పాస్ వెబ్సైట్ను మే 11 నుంచి 21 వరకు తెరవాలని నిర్ణయించింది. ఇప్పటికీ దరఖాస్తులు చేసుకోని, వివరాలను పొందుపరచని విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నది.