1) 1948 డిసెంబర్లో జైపూర్ కాంగ్రెస్ సమావేశం రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణపై ‘నెహ్రూ, పటేల్, పట్టాభి సీతా రామయ్య’ లతో ఒక కమిటీని ఏర్పరిచింది.
2) గొల్లపూడి సీతారామ శాస్త్రి నిరాహార దీక్ష – ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు నిరాహార దీక్ష చేపట్టిన మొదటి వ్యక్తి. 1951 ఆగస్టు 15న దీక్ష ప్రారంభించారు. 35 రోజుల తర్వాత ఆచార్య వినోబా భావే మధ్యవర్తిత్వం ద్వారా విరమించారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : 1948 డిసెంబర్లో జైపూర్ కాంగ్రెస్ సమావేశం రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణపై ‘నెహ్రూ, పటేల్, పట్టాభి సీతారామయ్య’లతో ఒక కమిటీ ఏర్పరిచింది. కేవలం భాషను మాత్రమే కాకుండా పరిపాలన, అభివృద్ధి, జాతీయ సమైక్యత అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ జరపాలని ‘జేవీపీ కమిటీ’ సూచించింది (1949 ఏప్రిల్ 1), గొల్లపూడి సీతారామ శాస్త్రి – ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేసిన మొదటి వ్యక్తి. 1951 ఆగస్టు 15న దీక్ష ప్రారంభించారు. 35 రోజుల తర్వాత ఆచార్య వినోబాభావే మధ్యవర్తిత్వం ద్వారా విరమించారు. 1952, అక్టోబర్ 19 నుంచి మద్రాస్లోని ‘బులుసు సాంబమూర్తి’ గృహంలో పొట్టిశ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష 50వ రోజున మద్రాసును సందర్శించిన నెహ్రూ.. మద్రాస్ వదులుకుంటే ప్రత్యేకాంధ్ర ఏర్పాటు కష్టం కాదని తెలిపారు. 58 రోజుల తర్వాత 1952, డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు మరణంతో హింస, నిరసనలు పెరిగాయి. డిసెంబర్ 19న నెహ్రూ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్లోప్రకటించారు.
1) హైదరాబాద్ రాష్ర్టంలో విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రతి 1000 జనాభా గల గ్రామానికి పాఠశాలను ఏర్పాటు చేశారు.
2) ఆసామి షక్మీ చట్టం – 1944 : ఎం. ఎస్ భరూచ కమిటీ సూచనల మేరకు ఈ చట్టం రూపొందించారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది
బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : బి
వివరణ : విద్యా సంస్కరణలు
1) 1951 , ఏప్రిల్ 18న వినోబా భావే భూదానోద్యమ మొదటి పాదయాత్రను పోచంపల్లి నుంచి ప్రారంభించారు.
2) వినోబా భావే ఈ మొదటి పాదయాత్రకు కేతిరెడ్డి కోదండరాం రెడ్డి బాధ్యత వహించారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది
బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : 1951 ఏప్రిల్ 18న వినోబాభావే భూదానోద్యమ మొదటి పాదయాత్రను పోచంపల్లి నుంచి ప్రారంభించి అక్కడ నుంచి వరంగల్ వెళ్లారు. ఈ పాదయాత్ర తెలంగాణలో 51 రోజుల పాటు దాదాపు 200 గ్రామాల్లో జరిగింది. సుమారు 1,90,000 ఎకరాలు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, కడప జిల్లాలకు చెందిన భూస్వాములు దానం చేశారు. వినోబాభావే మొదటి పాదయాత్రకు కేతిరెడ్డి కోదండరాంరెడ్డి ఇన్చార్జ్గా వ్యవహరించారు.
1) జె.వి.పి. కమిటీ తన నివేదికను 1949, ఏప్రిల్ 5న సమర్పించింది
2) జె.వి.పి. కమటీ భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటును కొన్నాళ్లు వాయిదా వేయాలని సూచించింది. కానీ ఆంధ్రరాష్ట్ర విషయంలో మాత్రం ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది
బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ – జె.వి.పి కమిటీ
1) 1957, నవంబర్ 1న రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది.
2) భారతదేశంలో గతంలో ఉన్న రాష్ర్టాలు రద్దు చేసి నూతనంగా 14 రాష్ర్టాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది
బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : బి
వివరణ – రాష్ట్రపతి బాబు రాజేంద్రపసాద్ రాష్ర్టాల పునర్ విభజన బిల్లును ఆమోదించారు.
1956 నవంబర్ 1న రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చింది. భారతదేశంలో గతంలో ఉన్న రాష్ర్టాలు రద్దు చేసి నూతనంగా 14 రాష్ర్టాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
1) 1952 హైదరాబాద్లో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి.
2) హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 175 శాసన సభ్యులు ఉండేవారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది
బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ – 1952 హైదరాబాద్లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 175 శాసన సభ్యులు ఉండేవారు.
1) పొట్టి శ్రీరాములు 1952, అక్టోబర్ 19న మద్రాసు నగరంలో బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు
2) పొట్టి శ్రీరాములు 59 రోజులు దీక్షచేసి 1952, డిసెంబర్ 15న మరణించారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది
బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : ఎ
వివరణ : చాలా కాలంగా ప్రత్యేక ఆంధ్రరాష్ర్టాన్ని కోరుతున్న ప్రజల ఆకాంక్షను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పొట్టి శ్రీరాములు 1952, అక్టోబర్ 19న మద్రాసు నగరంలో బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 58 రోజులు దీక్షచేసి 1952, డిసెంబర్ 15న మరణించారు.
నిజాం కాలంలో స్వీయ సంస్కరణల గురించి సంబంధించి కింది వాటిలో సరైనది?
1) అత్యంత కింది స్థాయి సివిల్ కోర్టులను బుజంగ్ అంటారు
2) అత్యంత కింది స్థాయి క్రిమినల్ కోర్టులను కుర్ద్ అంటారు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది
బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
21. వరంగల్ ముల్కీ ఉద్యమం ప్రారంభం.నిశ్చితం (ఎ) హనుమకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్న రషీద్ – అల్ – హసన్ను పార్థసారధి వేధింపులకు గురిచేయగా అతడు మరణించడం మొదలైన సంఘటనల ఫలితంగా వరంగల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు 1952లో ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించారు.
కారణం (ఆర్) : ఈ విషయం తెలుసుకున్న సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు హనుమకొండ చౌరస్తా నుంచి ‘నాన్- ముల్మీ గో బ్యాక్’ ఇడ్లీ – సాంబార్ గో బ్యాక్ అనే నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రదర్శన చేశారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) (ఎ), (ఆర్) రెండూ సత్యం (ఎ), (ఆర్)కు సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సత్యం (ఎ), (ఆర్)కు సరైన వివరణ కాదు
సి) (ఎ) సత్యం, కాని (ఆర్) అసత్యం
డి) (ఎ) అసత్యం, కాని (ఆర్) సత్యం
జవాబు : ఎ
వివరణ : వరంగల్ ముల్కీ ఉద్యమం ప్రారంభం
1952 జూన్ – జూలై నెలల్లో, వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా ఉన్న పార్థసారథి 180 మంది ఉపాధ్యాయులను ఒకేసారి మూకుమ్మడిగా బదిలీ చేశారు. వీరిలో కొంతమందిని దూరప్రాంతాలకు బదిలీ చేయగా మరికొంతమందిని క్రమశిక్షణ చర్యల పేరుతో ఇబ్బందులు పెట్టారు. అంతేకాకుండా హనుమకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్న రషీద్ – అల్ – హసన్ను పార్థసారథి వేధింపులకు గురిచేస్తే అతడు మరణించడం వంటి సంఘటనల ఫలితంగా వరంగల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు 1952లో ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1952, జూన్ 28న, జూలై 15న సెంట్రల్ మిడిల్ స్కూల్కు చెందిన 9 మంది ఉపాధ్యాయులు, పార్థసారథి చేసిన అక్రమాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి హయగ్రీవాచారి ఫిర్యాదు చేశారు. 1952, జూలై 26న, ఫిర్యాదులను విచారించడానికి విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. షెండార్కర్ వరంగల్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సుమారు నాలుగువేల మంది విద్యార్థులు హనుమకొండ చౌరస్తా నుంచి ‘నాన్-ముల్కీ గో బ్యాక్’, ‘ఇడ్లీ – సాంబార్ గో బ్యాక్’ అనే నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రదర్శన చేశారు. ఈ విధంగా ముల్కీ ఉద్యమం క్రమంగా ప్రారంభమై హైదరాబాద్ రాష్ట్రం అంతటా విస్తరించింది.
– దొమ్మటి తిరుపతి
ఫ్యాకల్టీ, ఎస్ జే ట్యుటోరియల్స్