హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (DDMS) లిటరసీ హౌస్ వివిధ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నది. వీటికి సంబంధించిన దరఖాస్తుల గడువు (Last date) రేపటితో ముగుస్తున్నది. ఆసక్తి కలిగినవారు అప్లయ్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ కోర్సులైన ట్యాక్సేషన్, బ్యుటీషియన్, ఎమ్మెస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ (ఆఫీస్ ఆటోమేషన్), ట్యాలీ-ఈఆర్పీ 9, యోగా, హ్యాండ్ ఎబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగ్ మేకింగ్, హేర్ స్టయిలిస్ట్లో ఉచితంగా శిక్షణ అందించనున్నారు.
వీటితోపాటు టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, గ్రాఫిక్ డిజైనింగ్, మీడియా రైటింగ్ ఇన్ తెలుగు తదితర కోర్సులను అందిస్తున్నట్లు డీడీఎంఎస్ సెక్రటరీ నాగలక్ష్మి తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8498080599, 9951210441, 7013457432 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.