న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 324 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి స్టెనోగ్రాఫర్, మినిస్టీరియల్ విభాగంలో ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది.
మొత్తం పోస్టులు: 324
ఇందులో ఏఎస్ఐ (స్టెనో) 11, హెడ్కానిస్టేబుల్ 312 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఇంటర్ లేదా 10+2 ఉత్తీర్ణీత సాధించి 18 నుంచి 25 ఏండ్లలోపు వయస్కులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్, షార్ట్హాండ్ టెస్ట్.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 6
వెబ్సైట్: www.rectt.bsf.gov.in