శాతవాహనుల పరిపాలనా విధానం శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా అధికారంలోకి వచ్చారు. కాబట్టి మౌర్యుల పరిపాలనలో కూడా మౌర్యుల పాలన విధానాన్ని అనుసరించారు. శాతవాహనుల పాలనా వ్యవస్థకు ఆదర్శం -మౌర్యులు శాతవాహనులు తమ పాలనలో మార్గదర్శకాలుగా తీసుకున్న రెండు గ్రంథాలు కౌటిల్యుడి అర్థ శాస్త్రం, మనువు మనుధర్మ శాస్త్రం. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న సప్తాంగాల ప్రకారం శాతవాహనులు పరిపాలించారు. శాతవాహనుల పరిపాలనా వ్యవస్థ గురించి తెలియజేసే శాసనం ఉన్నావ్ ఘర్ శాసనం. శాతవాహన రాజ్యం బలమైన కేంద్రీకృత రాచరికం కాదు. శాతవాహనులు వికేంద్రీకృత విధానం, పరిమిత యంత్రాంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. శాతవాహనులు పాలనలో పురుషార్థాలకు ప్రాధాన్యమిచ్చారు. రాజు-రాజ్యం శాతవాహన రాజులు మహాపథ నిర్మాతలుగా ప్రసిద్ధి శాతవాహనుల కాలంలో రాజు రాజ్యాధినేత. రాజుకు రాజ్యం/ అధికారం వారసత్వంగా లభించేది. రాజు దైవాంశ సంభూతుడు. రాజ్యాధికారం దైవదత్తం అనే భావన ఉండేది. రాజు ప్రాజ్ఞ నిరంకుశుడు అయినప్పటికీ, శ్రేయోరాజ్య భావనతో పాలించారు. సప్తాంగాల్లో రాజు ప్రధానుడు. రాజు వైదిక, వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించాలి. రాజుకు ఉన్న విద్యుక్త థర్మాలన్నీ పూర్తిగా సమర్థవంతంగా నిర్వహించిన శాతవాహన రాజుల్లో గౌమమీపుత్ర శాతకర్ణి గొప్పవాడు. శాతవాహనులు తమ రాజ్యాన్ని కింది విధంగా విభజించి పాలించారు. రాజ్యం- రాజుఆహారాలు అమాత్యులు విషయాలు విషయపతులు గ్రామాలు - గ్రామిణి/ గ్రామిక రాజు రాజ్యానికి అధిపతి పాలనా సౌలభ్యం కోసం, రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. శాతవాహనుల అత్యున్నత పాలనా విభాగం-ఆహారం శాతవాహనుల కాలంనాటి ముఖ్య ఆహారాలు గోవర్ధన హార కోడూరు హార సోపార హార మైసోలియా హార శాతవాహన హార ఆహారాల్లో ప్రసిద్ధి చెందినది గోవర్ధన హార ఆహారాలపై అధికారిని అమాత్యుడు అని పిలిచేవారు. అమాత్యులకు వంశపారంపర్య హక్కులు లేవు ఆహారాలను మళ్లీ విషయాలుగా విభజించారు. విషయాలపై అధికారిని విషయపతి అని పిలిచేవారు. పాలనా విభాగాల్లో చివరిది, ముఖ్యమైనది గ్రామం గ్రామంపై అధికారిని గ్రామిక/ గ్రామిణి అని పిలిచేవారు. పట్టణ పాలన శాతవాహనుల కాలంనాటి పట్టణ ప్రాంతాలను గురించి తెలియజేసే శాసనం భట్టిప్రోలు నిగమసభ శాసనం ఈ శాసనాన్ని జారీ చేసినది కుబేరుడు పట్టణ పాలనను నిర్వహించేది నిగమసభలు నిగమసభలనేవి పౌరసభలు. నిగమసభలోని సభ్యులు గహపతులు గహపతులు సమాజంలో కులపెద్దలుగా కూడా చెలమణి అయ్యేవారు నిగమసభలు స్వతంత్ర పాలనాధికారాలు కలిగి ఉండేవి. ఆంధ్రులు పట్టణాల్లో నివసించేవారని వారికి 30 కోటలు ఉన్నాయని మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు. స్థానిక పరిపాలన పాలనా వ్యవస్థలో చివరి విభాగం గ్రామం. శాతవాహనుల కాలంలో పరిపాలనకు ప్రాతిపదిక గ్రామం. గ్రామ పరిపాలనకు గ్రామసభలు ఉండేవి. గ్రామంపై అధికారిని గ్రామిక/ గుల్మిక/ గ్రామిణి అని పిలిచేవారు. గ్రామాధికారి ఆధీనంలో 5 నుంచి 10 గ్రామాలుండేవి. ఈ ప్రాదేశిక విభాగాన్ని గుల్మి అని, దీని అధిపతిని గుల్మికుడు అనేవారు. మూడో పులోమావి జారీ చేసిన మ్యాకధోని శాసనం శాతవాహనుల కాలం నాటి గ్రామపాలన గురించి, గ్రామంలో ముఖ్య శాంతిభద్రతల అధికారి అయిన గుల్మిక వివరాలను అందించింది. గ్రామస్థాయిలో ఉండే అధికారులు లేఖకుడు గ్రామస్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు మహాతరహా గ్రామాధ్యక్షుడు మహాఆర్యక - గ్రామస్థాయిలో మతధార్మిక వ్యవహారాలు ప్రతిహారి - రాజు ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకుపోయే అధికారి గ్రామసభలకు స్వయం పాలనాధికారాలు ఉండేవి. మంత్రిమండలి రాజుకు పరిపాలనలో సహకారం అందించడానికి మంత్రి పరిషత్/ మంత్రి మండలి ఉండేది. రాజు సలహాలను అమలు చేయడానికి అక్షపటం అనే సచివాలయం ఉండేది. రాజుకు పాలనలో సలహాలు ఇవ్వడానికి ప్రధానంగా నలుగురు మంత్రులుండేవారు. వారు రాజ అమాత్యులు రాజుకు సలహాలు ఇచ్చే మంత్రులు మహా అమాత్యులు - ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైన మంత్రులు విశ్వఅమాత్యులు - రాజు ఆంతరంగిక సలహాదారులు అమాత్యులు ఆహారములకు అధిపతులు శాతవాహనులు- సైనిక వ్యవస్థ శాతవాహన రాజులు తరచుగా చేసిన దండయాత్రల వల్ల వారికి పెద్ద సైనిక బలం ఉన్నట్లు తెలుస్తుంది. హతిగుంఫా శాసనం శాతవాహనుల కాలంనాటి చతురంగ బలాలను గురించి పేర్కొన్నది. శాతవాహనుల కాలంనాటి సైనిక విన్యాసాలు, వ్యూహరచన అమరావతి శిల్పాల ద్వారా తెలుస్తున్నది. స్కందవారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం కటకం అంటే సైన్యాగారం ప్రతి రాష్ట్రంలోనూ సైన్యాగారం ఉండేది. ప్రతి నగరానికి రక్షణ మార్గాలు ఉండేవి. ముఖ్య అధికారులు రాజుకు పాలనలో సలహాలివ్వడానికి మంత్రిమండలితోపాటు ముఖ్యమైన అధికారులు కూడా ఉండేవారు. మహాసేనాధిపతి సైన్యానికి అధిపతి హిరణికుడు కోశాధికారి భాండారికుడు వస్తు సంచయిక అధికారి నిబంధకారుడు రికార్డులను భద్రపరిచే అధికారి మహామాత్ర మత ధార్మిక విషయాలపై అధికారి ప్రతిహారుడు - కోట రక్షకుడు ప్రజలకు రాజ దర్శనం కల్పించే అధికారి లేఖకుడు రాజాజ్ఞలను రచించి, భద్రపరిచే అధికారి దూత - రాయబారి అక్షపటల - రాజాజ్ఞలను అమలు పరిచే అధికారి రజ్జిగాహకుడు భూమిని సర్వే చేసి, శిస్తు నిర్ణయించి వసూలు చేసే అధికారి పరిందవారాలు - సైనిక దళంలో గూఢచారులు ఉద్యోగులకు / అధికారులకు జీతాలు ధన రూపంలో చెల్లించేవారు శాతవాహనులు-ఆర్థిక పరిస్థితులు వ్యవసాయం- పంటలు శాతవాహనుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయానికి బావులే ప్రధాన ఆధారం. నీళ్లు తోడటానికి ఉదక యంత్రాలను వాడేవారు. దీన్నే పర్షియా చక్రం అని కూడా అంటారు. బెల్లం బట్టీలు, కొబ్బరి తోటలు, ఆకుతోటలు ఎక్కువగా ఉండేవి. శాతవాహనుల కాలంలో ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి ప్రధాన ప్రయాణ సాధనం ఎండ్లబండి పంటలు పండే క్షేత్రాలు సీత క్షేత్రాలు వ్యవసాయ పర్యవేక్షణ అధికారి -సీతాధ్యక్ష వ్యవసాయ పొలాల్లో స్త్రీ పురుషులు కలిసి పనిచేసేవారని గాధాసప్తశతి పేర్కొన్నది. ఆధునిక వ్యవసాయ పనిముట్లను తయారు చేయడానికి ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం ఓదయంత్రిక ఉదగయంత్రం బావుల నుంచి నీటిని పైకి లాగే యంత్రం ఘటి యంత్రం భూమిని దున్నే యంత్రం గరిక యంత్రం - ముడి పత్తి నుంచి విత్తనాలు వేరు చేసే యంత్రం వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేసేవారు. [caption id="attachment_1517353" align="alignnone" width="300"] 1[/caption] భూస్వామ్యం- భూమిశిస్తు శాతవాహనులు భూస్వామ్య వ్యవస్థను మొదటిసారిగా ప్రారంభించారు. భూమిని దానం చేసే పద్ధతిని ప్రారంభించారు. బ్రాహ్మణ, శ్రవణుకులకు భూ పరిహారాలిచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించారు. మొదటిసారిగా దానం చేసిన భూములపై పరిపాలనాధిక్యతను, నియంత్రణను వదులుకున్న శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. భూమిపై రైతుల హక్కులు గుర్తించబడ్డాయి. రాజ్యంలోని వ్యవసాయ భూమి అంతా రాజు సొంతం కాదు. కేవలం రాజు క్షేత్రం మాత్రమే రాజుకు సొంతం. రాజు సొంత భూములు- రాజుక్షేత్రం, రాజకంబేట రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమిశిస్తు భూమి శిస్తు 1/6 వంతు లేదా 18 శాతం భూమి శిస్తును ధేయమేయ/ రాజభాగం/ భాగ అని పిలిచేవారు. భూమి పన్ను గాక రహదారుల సుంకాలు, కరుకర అనే వృత్తిపన్నులు వసూలు చేసేవారు. పన్నులను ధన, ధాన్య రూపంలోను వసూలు చేసేవారు క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి, శిస్తు నిర్ణయించి వసూలు చేసేది రజ్జగాహకుడు. ముఖ్య పన్నులు భాగ పండిన పంటలో 1/6 వంతు కరుకర వృత్తి సంఘాలు చెల్లించే పన్ను కర- కూరగాయలు తోటలపై విధించే పన్ను శుల్క నీటి తీరువా పన్ను యజ్ఞ యాగాదుల సమయంలో రాజు ప్రజలపై విధించే పన్ను బలి ప్రధాన ఆదాయ వనరులు భూమిశిస్తు, రేవు సుంకాలు, వృత్తి సంఘాలు శ్రేణులు -వృత్తి సంఘాలు శాతవాహనుల కాలంలో ఒక్కొక్క వృత్తిని అనుసరించే వారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు. ప్రతి శ్రేణికి శ్రేష్టి అనే అధ్యక్షుడు ఉండేవాడు. శ్రేష్టి కార్యస్థానం నిగమసభ ప్రతి శ్రేణి తనకు తానే నిబంధనలను రూపొందించుకునేది. దీన్ని శ్రేణి ధర్మం అనే వారు. ఒక వృత్తి వారు మరో వృత్తిలో ప్రవేశించకుండా శ్రేష్టి విధించే నిబంధన- సమయ ధర్మం శ్రేణి నిర్వర్తించే ప్రధాన విధులు సభ్యుల శ్రేయస్సును సంరక్షించడం బ్యాంకులుగా వ్యవహరించడం సభ్యుల నుంచి డిపాజిట్లు స్వీకరించడం సభ్యుల డిపాజిట్లపై 12 శాతం వరకు వడ్డీ చెల్లించడం. రుణాలను మంజూరు చేయడం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం శాతవాహనుల కాలంలో కర్షక ప్రతినిధి గహపతి శాతవాహనుల కాలం నాటి శాసనాల ప్రకారం -18 శ్రేణులు ఉన్నట్లు తెలుస్తుంది. అవి