అహ్మదాబాద్: భారత్తో డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. భారత స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్లో కెప్టెన్ జో రూట్(17) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. అంతకుముందు ఓపెనర్ డొమినిక్ సిబ్లే(0), జానీ బెయిర్స్టో(0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. 21.5 ఓవర్లకు ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఆల్రౌండ్ బెన్స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు.
ఇంకో ఎండ్లో మరో ఓపెనర్ జాక్ క్రాలే(53) దూకుడుగా ఆడుతున్నాడు. ఆరంభం నుంచి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగులు సాధిస్తున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ 68 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అందులో 10 ఫోర్లు ఉండటం విశేషం. క్రాలేకిది నాలుగు టెస్టు అర్ధసెంచరీ.