కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తెలుగులో తొలిసారి ప్రమోషన్స్ చేసుకుని మరీ విడుదల చేసుకున్న సినిమా యువరత్న. ఎప్రిల్ 1న విడుదలైన ఈ చిత్రం వారం రోజుల్లోనే ఓటిటిలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. తెలుగులో ఈ చిత్రానికి టాక్ కూడా బాగానే వచ్చింది కానీ పునీత్ కు క్రేజ్ లేకపోవడంతో కలెక్షన్స్ రాలేదు. కెజియఫ్ లాంటి భారీ సినిమాను నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. పునీత్ ఎవరో ఇక్కడ తెలియకపోయినా కూడా ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సాయి కుమార్ లాంటి తెలిసిన వాళ్లే ఉన్నారు. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేసాడు. దాంతో పాటు మరికొన్ని ఏరియాల్లో కూడా పెద్ద డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చారు సినిమాను. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం పవర్ స్టార్ పాచిక పారలేదు. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ వివరాలు బయటికి వచ్చాయి..
నైజాం- 22 లక్షలు
సీడెడ్- 13 లక్షలు
ఉత్తరాంధ్ర- 16 లక్షలు
ఏపీ + తెలంగాణ(టోటల్)- 51 లక్షలు షేర్
‘యువరత్న’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కె.జి.ఎఫ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా వరకు వాళ్ళే ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినా కూడా 55 లక్షలు వస్తే కానీ పునీత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. కాకపోతే దానికి 4 లక్షలు తక్కువగా వచ్చాయి. దాంతో సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ‘వైల్డ్ డాగ్’ ‘సుల్తాన్’ లాంటి సినిమాలతో పోటీ పడి వచ్చిన యువరత్న తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విఫలమైందనే చెప్పాలి.