హైదరాబాద్ : సికింద్రాబాద్లో యువతి దారుణ హత్యకు గురైంది. ఓ యువకుడు చున్నీతో చెట్టుకు ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటన అల్వాల్ జీహెచ్ఎల్ఈ కాలనీ వద్ద రైల్వేట్రాక్ పక్కన చోటు చేసుకున్నది. యువతిని హత్య చేసిన తర్వాత చున్నీతో చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతురాలిని డిగ్రీ విద్యార్థి సరస్వతిగా గుర్తించారు. బోయిన్పల్లి ఒమేగా కళాశాలలో సరస్వతీ డిగ్రీ చదువుతోంది. యువతిని హత్య చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోమవారం నిన్న ఉదయం ఇంట్లో నుంచి సరస్వతి బయటకు వెళ్లింది. అయితే, ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.