న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్స్..సరికొత్త బైకు ‘వైజెడ్ఎఫ్-ఆర్15ఎం’ని పరిచయం చేసింది. వార్షికోత్సవ ఎడిషన్గా విడుదల చేసిన ఈ స్పోర్ట్స్ బైకు ధర రూ.1.88 లక్షలుగా నిర్ణయించింది. దీంతోపాటు మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంటీ-15 బైకును కూడా విడుదల చేసింది. ఈ బైకు ధర రూ.1.60 లక్షలు. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 155 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తయారైన ఈ బైకు 18.4 పీఎస్ వద్ద 10,000 ఆర్పీఎం శక్తినివ్వనున్నది.