మారేడ్పల్లి, అక్టోబర్ 20: సికింద్రాబాద్లోని యశోద దవాఖాన, యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ, నిరుపేద యువతకు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, జీవన నైపుణ్యం, బ్యూటీషియన్, టైలరింగ్, మెహందీలో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఫౌండేషన్ ప్రతినిధి పీ నవీన్కుమార్ బుధవారం వెల్లడించారు. అభ్యర్థులకు వస తి, భోజనం, రవాణా ఖర్చులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులతోపాటు అనాథ, నిరుపేద, అవివాహితులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 8790903410 నంబర్ను సంప్రదించాలని కోరారు.