యాదాద్రి: పవ్రిత పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి,అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వ హించారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, అనంతరం తులసీ ప్రతాలతో అర్చన జరిపారు.
దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. బాలాలయంలోని మహా మండపంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన, నిత్య తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామివారికి పవళింపు సేవ నిర్వహించారు.
యాదాద్రిశుడిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారాజేందర్ సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వామివారి వేద ఆశీర్వ చనం, తీర్ధప్రసాదాలు అందజేశారు.