యాదాద్రి, డిసెంబర్ 30: ఎవరు అవునన్నా కాదన్నా వెయ్యేండ్లు నిలిచే యాదాద్రి చరిత్రకు సీఎం కేసీఆరే నిర్మాత అని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ కొనియాడారు. గురువారం ఏకాదశిని పురస్కరించుకొని లక్ష పుష్పార్చనను అర్చకులు వైభవంగా నిర్వహించారు. సుద్దాల అశోక్ తేజ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుద్దాల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ యాదాద్రిని ఆసియా ఖండంలోనే అత్యుత్తమ ఆలయంగా తీర్చిదిద్దారంటూ ప్రశంసలు కురిపించారు.