యాదాద్రి: యాదాద్రి నరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 9,96,967 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,32,214, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,000, వీఐపీ దర్శనాల ద్వారా 60,000, వేద ఆశీర్వచనం ద్వారా 9,288, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 4,650, వ్రత పూజల ద్వారా 35,500,
కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 19,160, ప్రసాద విక్రయం ద్వారా 3,85,125, వాహన పూజలతో 17,400, టోల్గేట్ ద్వారా 1,240, అన్నదాన విరాళం ద్వారా 9,162, సువర్ణ పుష్పార్చన ద్వారా 1,10,780, యాదరుషి నిలయం ద్వారా 47,400, పాతగుట్ట నుంచి 13,130, గోపూజ ద్వారా 550, ఇతర విభాగాల ద్వారా 85,368 మొత్తంగా ఖజానాకు రూ.9,96,967 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.