కరీంనగర్ : మహిళలు ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతిని సాధించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. హుజరాబాద్లోని మంత్రి క్యాంప్ ఆఫీసులో డీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘాల మహిళలకు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయంకృషితో ఎంతోమంది మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు.
ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.