డియోఘర్: జార్ఖండ్లోని డియోఘర్లో ఉన్న త్రికూట పర్వత రోప్వేలో ఆదివారం రెండు కేబుల్ కార్స్ ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో రోప్వేపై చిక్కుకున్న వారిని రక్షించారు. కానీ ఓ మహిళ ఇవాళ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో హెలికాప్టర్ నుంచి జారిపడి మృతిచెందింది. దీంతో ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. దాదాపు 40 గంటల పాటు కేబుల్ కార్స్లో ఉన్న 15 మందిని ఇవాళ రక్షించారు. ఈ ఆపరేషన్లో భారతీయ వైమానిక దళ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. 15 మందిలో ఓ మహిళ హెలికాప్టర్ నుంచి జారిపడి మృతిచెందినట్లు అదనపు డీజీపీ ఆర్కే మాలిక్ తెలిపారు. చనిపోయిన మహిళను 60 ఏళ్ల శోభాదేవిగా గుర్తించారు. రెస్క్యూ చేసిన వారిని హాస్పిటల్కు తరలించారు. రోప్వే ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ రమేశ్ తీవ్ర సంతాపం తెలిపారు.