విశ్వంత్, శుభశ్రీ జంటగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ ఓ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సునీల్, అలీ, రఘుబాబు, ఖయ్యుం, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ…‘సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అనుభవం గల సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు. ఈ రోజు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఈశ్వర్, ఎడిటర్ : అమర్ రెడ్డి, సంగీతం : శ్రావణ్ భరద్వాజ్.