ఉదయ్ శంకర్, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. గురు పవన్ దర్శకుడు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నల్లమలుపు బుజ్జి అతిథులుగా హాజరయ్యారు. ‘థిల్లర్ కథతో సినిమా చేస్తున్నామని, ఈనెల 25 నుంచి విశాఖలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామని, యువతను ఆకట్టుకునే కథ కథనాలతో సినిమా రూపొందిస్తున్నామని’దర్శకుడు తెలిపారు. మధు నందన్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : గిఫ్టన్