హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో జీతాల పెంపు విషయంలో నిర్ణయాన్ని మార్చేది లేదని పేర్కొన్నది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి యధావిధిగా జీతాలను పెంచనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. క్వార్టర్లీ ప్రమోషన్లో భాగంగా తొలి దశ పూర్తి అయినట్లు ఆ సంస్థ చెప్పింది. జీతాలను పెంపు విషయంలో ఎటువంటి మార్పు లేదని, పెంచిన జీతాలను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇవ్వనున్నట్లు విప్రో తెలిపింది. వేరియబుల్ పే విషయంలో కామెంట్ చేసేందుకు ఆ సంస్థ నిరాకరించింది.