మైలార్దేవ్పల్లి : పార్కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు.సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని మార్కండేయనగర్ కాలనీలో అధికారులతో కలిసి పర్యటించారు. మూడు కాలనీలకు ఆనుకోని ఉన్న నర్సాబాయి కుంటలో మురుగు సమస్య లేకుండా పార్కు చేయాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను కోరారు.
కాలనీలో సీసీ రోడ్లు,డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..నర్సాబాయి కుంటలో ఉన్న మురుగు నీటి సమస్య సత్వరమే పరిష్కరించి పార్కుకు కావలసిన ఎస్టిమేషన్ వేయాలని ఎరిగేషన్ , జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
నర్సాబాయి కుంటలో శ్మశాన వాటిక వరకు ప్రహారి గోడ నిర్మించి మిగత స్థలంలో మురుగు నీరు నిలువకుండా నర్సాబాయి కుంట పార్కుగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు.సీసీ రోడ్లు ,డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని జలమండలి ,జీహెచ్ఎంసీ అధికారులకు కోరారు.
మహిళలకోసం మహిళ బిల్డింగ్ నిర్మించాలని ఎమ్మెల్యేకు కాలనీ పోదుపు సంఘాల గ్రూపు సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. మహిళ బిల్డింగ్ స్థలం ఉండడంతో ఎస్టిమేషన్ వేయాలని సర్కిల్ ఈఈకి చెప్పారు. కాలనీ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని ఎమ్మెల్యే కాలనీ ప్రజలకు హమీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ మండల తహశీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ,ఆర్ఐ సారిక,సర్కిల్ ఈఈ నరేందర్ గౌడ్ ,ఏఈ బల్వంత్ రెడ్డి,జలమండలి జీఎం చంద్రశేఖర్ ,డీజీయం అబ్దుల్ సత్తార్ ,మాజీ కౌన్సిలర్ వెంకటేష్,డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ ,రఘుయాదవ్ ,ఏర్వ సత్యనారాయణ,గద్దె క్రిష్ణ,పగిడిమరి సూర్యనారాయణ,వెల్ఫేర్ అసోసియోషన్ సెక్రటరి మామిడి శెట్టి శ్రీనివాస్,కోటశ్యామ్ ,సిరందాస్ నరేందర్ ,పూల పద్మమ్మ ,మహిళ సంఘం అధ్యక్షురాలు