అమరులైన వారికి సంతాప సూచకంగా 2 నిమిషాల మౌనం పాటించడం అందరికీ సుపరిచితమే. ప్రముఖులు చనిపోయినప్పుడు వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం.
మరి ఆ మౌనం పాటించడానికి కారణం ఏంది? అసలు మౌనం పాటించాలనే కాన్సెప్ట్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలను తెలుసుకుందాం.
క్రిస్టియన్ ఉద్యమం
సుమారు 300 ఏండ్ల కిందట దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో క్రిస్టియన్ ఉద్యమం జరిగినప్పుడు అనేక మంది చనిపోయారు. దీంతో ఆ ఉద్యమంలో అమరులైన వారి త్యాగానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇక మొదటి ప్రపంచం యుద్ధం తరువాత సర్ పెర్సీ ఫిట్జ్ప్యాట్రిక్ ఒకసారి కింగ్ జార్జ్ V కి మౌనం పాటించడంపై సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన కామన్వెల్త్ రిమెంబరెన్స్ డేస్ ఉత్సవాల్లో మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారిని స్మరించుకోవడం ప్రారంభించారు. ఇక కింగ్ జార్జ్ V ఆదేశాల మేరకు అమర జవాన్ల త్యాగానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించడం మొదలు పెట్టారు. అలా ఆ సంప్రదాయం ప్రారంభమైంది. దీన్ని అప్పటి నుంచి అనేక దేశాలు అనుసరించడం మొదలు పెట్టాయి.
అయితే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆయా దేశాలు శాంతి చర్చలతో యుద్ధాన్ని ముగిస్తే అప్పుడు ఆ దేశాలు కూడా 2 నిమిషాల పాటు మౌనం పాటించాలనే కొత్త సిద్ధాంతాన్ని ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు ఎడ్వార్డ్ జార్జ్ హనీ సూచించాడు. కానీ దీన్ని ఎవరూ పాటించడం లేదు. కాకపోతే తమ సొంత దేశానికి చెందిన జవాన్లు యుద్ధంలో చనిపోతే వారి కోసం మౌనం పాటించడం మొదలు పెట్టారు. ఇక చనిపోయిన వారు ప్రముఖులు అయితే వారికి గౌరవ సూచకంగా కూడా మౌనం పాటిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి