ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో తాము కలిసే పనిచేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తాను కాంగ్రెస్లో చేరడం లేదంటూ పీకే ప్రకటించిన తర్వాత మమతా బెనర్జీ ఇలాంటి ప్రకటన చేయడం విశేషం. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో సీఎం మమతా బెనర్జీ ప్రశాంత్ కిశోర్పై మాట్లాడారు.
అయితే.. ప్రశాంత్ కిశోర్కు ఓ రాజకీయ సిద్ధాంతం లేదంటూ కాంగ్రెస్లో సీనియర్లు తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారు. అయినా.. సోనియా ముందుకే కదిలారు. అచ్చు ఇలాంటి వాతావరణమే తృణమూల్లోనూ వుందట. పీకే సైద్ధాంతిక నిబద్ధతపై తృణమూల్ సీనియర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా తాను పీకేతో ప్రయాణించడానికే మొగ్గు చూపానని మమతా వెల్లడించారు.
మా పార్టీలో కూడా పీకేపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఆయనకిచ్చే బాధ్యతలపై కూడా తేడాలున్నాయి. అయినా… పీకేతోనే కలిసి ప్రయాణించాలని మేము డిసైడ్ అయ్యాము అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.