బేగంపేట్ నవంబర్ 25: బేగంపేట్ డివిజన్లోని ఓల్డ్ పాటిగడ్డలో డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరిశ్రీహరి అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు గురువారం కార్పొరేటర్ మహేశ్వరి జలమండలి, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఓల్డ్ పాటిగడ్డలో డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాలని కార్పొరేటర్ మహేశ్వరి అధికారులకు సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు వెచ్చించిన అనంతరం వారం రోజుల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ మహేశ్వరి తెలిపారు.