హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ అభ్యర్థిని జనరల్ స్థానంలో గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు చెందిన బీసీ అభ్యర్థి నోముల భగత్కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
14 బీసీ సంఘాలు, 47 బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అన్ని బీసీ కులాలు, సంఘాల నాయకులు సమావేశమై చర్చించి బీసీ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఒక్క బీసీ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, సంగెం సూర్యారావు, నడికూడ జయంత్ రావు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.