Kirti Azad : లోక్సభ నాలుగో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఏప్రిల్ 18న మొదలైన ఈ నాలుగో దశ నామినేషన్లు.. ఏప్రిల్ 25 వరకు కొనసాగనున్నాయి. పశ్చిమబెంగాల్లోని బర్దమాన్ దుర్గాపూర్ లోక్సభ స్థానానికి కూడా నాలుగో విడతలోనే పోలింగ్ జరగనుంది.
అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ బర్దమాన్ దుర్గాపూర్ లోక్సభ స్థానానికి మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ను తన అభ్యర్థిగా బరిలో దించింది. దాంతో ఆజాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఆజాద్.. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
లోక్సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, కీర్తి ఆజాద్ నామినేషన్ దాఖలు చేసిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | West Bengal: Former cricketer and TMC candidate from Bardhaman–Durgapur, Kirti Azad files his nomination for #LokSabhaElections2024 pic.twitter.com/l1BCKJKdkq
— ANI (@ANI) April 23, 2024