వరంగల్, డిసెంబర్ 06 : గ్రేటర్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం 51వ డివిజన్ పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలో నిర్మించనున్న సమీకృత మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. బల్దియా అధికారులు ఇప్పటికే స్థలాన్ని చదును చేయగా, పనులు మొదలు పెట్టాలని సూచించారు. అనంతరం భద్రకాళీ బండ్పై స్మార్ట్సిటీ నిధులతో చేపట్టిన రెండో దశ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా ఇంజినీర్లు పర్యవేక్షించాలన్నారు. అనంతరం టీఎస్ బీపాస్లో దరఖాస్తు చేసుకున్న యజమానులకు చెందిన రెండు బహుళ అంతస్తుల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ వోలేటి, సిటీ ప్లానర్ వెంకన్న, డీసీపీ ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.