తెలంగాణ రైతులు పండించిన రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో జీపీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీలు, పీఏసీఎస్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయి. వీటి ప్రతులను కొరియర్, పోస్టు ద్వారా ప్రధాని మోదీకి పంపుతున్నాయి. మూడోరోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్, ఖానాపురం, వర్ధన్నపేట మండల పరిషత్ పాలకవర్గాలు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించాయి.
వరంగల్, మార్చి 27(నమస్తేతెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్లో మాదిరిగా తెలంగాణలో రైతుల నుంచి రెండు పంటల వడ్లను కొనుగోలు చేయాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమాలకు ఈ నెల 21న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా 24న శాసనసభ నియోజకవర్గం వారీగా టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు జరిగాయి. రాష్ట్ర మంత్రులు, నిరసన కార్యక్రమాల ఇన్చార్జిలు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, ఓడీసీఎంఎస్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు సమావేశాలకు హాజరైన శ్రేణులకు నిరసన కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేసి తీర్మానాలకు కార్యాచరణ ఖరారు చేశారు.
25వ తేదీ నుంచి జిల్లాలో గ్రామ పంచాయతీలు, పీఏసీఎస్లు, మండల పరిషత్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వడ్లు కొనాలని తీర్మానాలు చేస్తున్నాయి. ఆదివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రత్యేక సమావేశం జరిగింది. కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కమిటీ వైస్చైర్మన్ కాలేరు కరంచంద్, సభ్యులు పిన్నిం టి వెంకట్రావు, కంది రవీందర్రెడ్డి, గోలి రాజయ్య, పసునూరి సారంగపాణి, తుమ్మ రవీందర్రెడ్డి, గనిపాక విజయ్కుమార్, పట్టాపురం ఏకాంతంగౌడ్, పల్లెపాటి శాంతిరతన్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను సమావేశం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రైతులు పండించిన రెండు పంటల వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక సమావేశం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ఖానాపురం మండల పరిషత్ అధ్యక్షుడు వీ ప్రకాశ్రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఓడీసీఎంఎస్ చైర్మన్ రా మస్వామీనాయక్తో పాటు సభ్యులు సమావేశానికి హా జరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండించారు.
తెలంగాణ రైతులు పం డించిన రెండు పంటల వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. వర్ధన్నపేట మండల పరిషత్ అధ్యక్షుడు ఏ అప్పారావు అ ధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నాతో పాటు సభ్యులు పాల్గొన్నా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మా నం ఆమోదించారు. ఎనుమాముల మార్కెట్, ఖానాపురం, వర్ధన్నపేట మండల పరిషత్ల తీర్మానాల ప్రతులను సభ్యులు, టీఆర్ఎస్ శ్రేణులు కొరియర్, పోస్టు ద్వారా ప్రదాని మోదీకి పంపారు. ఒకటి రెండు రోజు ల్లో జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి ప్రధానికి ప్రతులు పం పేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.