ఏ ఎన్నిక వచ్చినా కారుదే జోరు : విప్ గువ్వల
సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష : ఎమ్మెల్యే అబ్రహం
అచ్చంపేట, ఉండవెల్లిలో విజయోత్సవ సంబురాలు
అచ్చంపేట, మార్చి 21 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు గు ర్తు జోరు కొనసాగుతుందని విప్, ఎమ్మెల్యే గువ్వ ల బాలరాజు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎ న్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ దుందుభి మోగించడంతో ఆదివారం అచ్చంపేట పట్టణం లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయులు, ఉ ద్యోగులు, యువకులు, పార్టీశ్రేణులు గువ్వలను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి మల్లంకుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలకూ పట్టభద్రులు బుద్ధి చెప్పారన్నారు. ఈ విజయం అమరవీరులకు అంకితమన్నారు. గెలుపునకు దోహదపడిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పె ట్టుకుంటామన్నారు.
బీజేపీ అహంకార మాటల కు పట్టభద్రులు గుణపాఠం చెప్పారని, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డులకు 20 గెలిచి రికార్డు తిరగరాస్తామన్నారు. అచ్చంపేటను మరో సిద్ధిపేట చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నోటిని అదుపులో పెట్టుకోవాలని లేదంటే ఇలాంటి గుణపాఠాలే పునరావృతం అవుతాయన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో రై తుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, పీ ఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, నాయకులు తు లసీరాం, మంత్రియానాయక్, రాంబాబు, చు క్కారెడ్డి, రానోజి, గోపాల్రెడ్డి, గోపాల్నాయక్, రాజేశ్వర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, విష్ణుమూర్తి, చెన్నకేశవులు, శంకర్మాదిగ, రవీందర్రెడ్డి, శివ, ప్రవీ ణ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అందరికీ కృతజ్ఞతలు..
ఉండవెల్లి, మార్చి 21 : సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే అబ్ర హం పేర్కొన్నారు. మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ వాణీదేవి గెలు పు సంబురాలు నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణు లు పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మతాల పేరుతో అల్లర్లు సృష్టించే పార్టీలను మట్టి కరిపించిన పట్టభద్రులు, ఉద్యోగులకు కృతజ్ఞత లు తెలిపారు. పీవీ శత జయంతి వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో ఆయన కుతురు వాణీదేవిని గెలిపించి పీవీకి ఘన నివాళి అర్పించారన్నారు. అనంతరం తనగల గ్రామానికి చెందిన తిములమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా రూ.లక్ష ఎల్వోసీని బాధితురాలి కొడుకు వీరేశ్కు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, వడ్డేపల్లి జెడ్పీటీసీ రాజు, టీఆర్ఎస్ నాయకులు రమణ, వెంకట్రామయ్యశెట్టి, దేవన్న, ప్రహ్లాదరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అల్లాబకాష్ తదితరులు పాల్గొన్నారు.