హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): గ్రీన్ చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను రాజస్థాన్కు చెందిన విష్ణుశ్రీ కల్పతరు సంస్థాన్ సంస్థ వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డుతో గౌరవించింది. శనివారం రాజస్థాన్లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్, ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణులాంబా అందజేశారు. అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంతోష్కుమార్ స్వయంగా హాజరు కాలేకపోవడంతో ఆయన తరఫున అవార్డును గ్రీన్చాలెంజ్ ప్రతినిధులు రాఘవ, మర్ది కరుణాకర్రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా ఎరిక్ సోల్హెమ్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్కుమార్ ఒక్కడిగా ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో రేపటి తరానికి బాటలు వేస్తుందని ప్రశంసించారు. పచ్చని ప్రకృతి కోసం తాము నిర్వహిస్తున్న గ్రీన్చాలెంజ్ కార్యక్రమానికి అనేక అవార్డులు, ప్రశంసలు దకాయని, ఈ అవార్డు ప్రత్యేకమైనదని సంతోష్కుమార్ తన సందేశంలో పేర్కొన్నారు.
వృక్షమిత్ర సమ్మాన్ అవార్డు తెలంగాణ బిడ్డలందరిది
వృక్షమిత్ర అవార్డు నాది మాత్రమే కాదు. కోట్లాది మొకలు నాటి న తెలంగాణ బిడ్డలది. రేపటి సమాజం కోసం సంకల్పించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా దేశ, విదేశాల్లో మొకలు నాటిన వృక్ష ప్రేమికులందరిది. ప్రకృతి ప్రేమికుడు ఎరిక్ సోల్హెమ్, ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణులాంబ చేతులమీదుగా అవార్డు అందుకోవడం ఎకడలేని ఎనర్జీని అందించింది.
-ఎంపీ సంతోష్కుమార్