న్యూఢిల్లీ, డిసెంబర్ 30: నూతన సంవత్సరంలో కార్ల కొనుగోలుదారులకు షాకిచ్చింది వొల్వో. జనవరి 1 నుంచి ఎంపిక చేసిన మోడళ్ళ ధరలను లక్ష రూపాయల నుంచి రూ.3 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎస్యూవీ ఎక్స్సీ 40 టీ4 ఆర్ డిజైన్ రూ.2 లక్షలు, ఎక్స్సీ60 బీ5 ఎస్యూవీ రూ.1.60 లక్షలు, సెడాన్ ఎస్90 రూ.3 లక్షలు, ఎస్యూవీ ఎక్స్సీ90 లక్ష రూపాయలు పెంచుతున్నట్లు తెలిపింది. మిగతా మోడళ్ళు సెడాన్ ఎస్60, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎక్స్సీ90 టీ8 ధరల్లో మార్పులు చేయలేదు.