బంజారాహిల్స్,జనవరి 5: ఫిలింనగర్కు చెందిన స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నేతలు వ్యవహరిస్తూ అభయాంజనేయస్వామి ఆలయ వ్యవహారంలో అనవసరమైన వివాదాన్ని రాజేస్తున్నారని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. ఫిలింనగర్లోని పటేల్నగర్లో నిర్మాణంలో ఉన్న ఆలయంవద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రెడ్ఫోర్ట్అక్బర్ ప్రాపర్టీస్ సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న ఆలయాన్ని ఫిలింనగర్ 18బస్తీలకు చెందిన స్థానికుల అంగీకారంతో పక్కనే ఉన్న 2750గజాల స్థలంలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని, రూ.10కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం బిల్డర్ రూ.5కోట్లు ఇస్తారని, భక్తుల సహకారంతో మరో ఐదుకోట్లను సమీకరిస్తామన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు వీహెచ్పీ అధ్యక్షుడు రామరాజు ప్రయత్నిస్తూ గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వచ్చే మాఘమాసంలో అభయాంజనేయస్వామి ఆలయం నిర్మాణపనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కృష్ణమాచారి స్వామీజి. బెనారస్ బాబా తదితరులు పాల్గొన్నారు.