బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో ( Basara RGUKT ) ఫిజికల్ హ్యాండీక్యాప్ ( PHC ) , సాయుధ బలగాల కోటా ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా, అన్ని నిబంధనలతో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన సాగిందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు.
పీహెచ్సీ కోటాలో హియరింగ్ ఇంపెయిర్డ్ , మెంటల్ రిటార్డేషన్ (Mentally Retarded), మల్టిపుల్ డిసార్డర్స్ , ఆర్థోపెడిక్ డిసెబిలిటీస్ , విజువల్ ఇంపెయిర్డ్ వంటి విభిన్న దివ్యాంగ విద్యార్థుల వైద్య ధ్రువీకరణ పత్రాలను నిర్మల్ జిల్లా ప్రభుత్వ వైద్యుల బృందం పరిశీలించింది.
సాయుధ బలగాల సిబ్బందికి చెందిన పిల్లల పత్రాల పరిశీలనను సంబంధిత సాయుధ శాఖల అధికారుల పర్యవేక్షణలో నిష్పాక్షికంగా నిర్వహించారు. ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన విద్యార్థుల ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో పొందపరచనున్నామని తెలిపారు.
జూలై 4న ప్రొవిజినల్లి సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు వివరించారు. మొదటి విడత కౌన్సెలింగ్ జూలై 7వ తేదీన ప్రారంభమవుతుందని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్షన్, కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కో కన్వీనర్లు డాక్టర్ దేవరాజు, డాక్టర్ విట్టల్, రాకేష్ రెడ్డి, హరికృష్ణ మంతపురి, బద్రినారాయణ, మోహన్ బాబు, ఇతర అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.