బంజారాహిల్స్, డిసెంబర్ 24: అందాల పోటీల్లో పాల్గొనడం ద్వారా యువత ఆత్మై స్థెర్యం పెంచుకోవడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలను నిర్ణయించుకునేలా దోహదపడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాలాచారి అన్నారు. మిస్టర్ అండ్ మిసెస్ 2021-22 ఏసియా మోడల్ పోటీలకు సంబంధించిన వివరాలను శుక్రవారం బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు ప్రియాంశ దూబే వెల్లడించారు. ఈ సందర్భంగా డా.వేణుగోపాలాచారి మాట్లాడుతూ, అందాల పోటీలు అంటే కేవలం శారీరకమైనవి కావని, మానసిక దృఢత్వాన్ని, చిత్తశుద్ధిని పెంపొందించడంలో ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మిస్టర్ అండ్ మిసెస్ 2021-22 ఏసియా మోడల్ పోటీలకు సంబంధించి గ్రాండ్ ఫైనల్ జనవరి 30న అట్టహాసంగా నిర్వహిస్తామని, హైదరాబాద్ నగరంలో ఔత్సాహికులను ఎంపిక చేసేందుకు జనవరి 2న ఆడిషన్స్ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.