న్యూఢిల్లీ: నూతన అటార్నీ జనరల్(ఏజీ)గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు కేంద్రం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్నది. ఏజీగా కొనసాగేందుకు వేణుగోపాల్ నిరాకరించడంతో.. ఆయన స్థానంలో వెంకటరమణిని కేంద్రం నియమించింది. ఇంతకుముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కూడా మరోసారి ఏజీ పదవి చేపట్టేందుకు నిరాకరించారు.