ఎప్పుడూ సీరియస్గా ప్రజాసమస్యలపై చర్చించే పార్లమెంట్ ఉభయసభల్లోనూ అప్పుడప్పుడూ సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. సభ్యుల పెదలాపై నవ్వులు విరబూస్తుంటాయి. అలాంటి ఘటనే రాజ్యసభలో జరిగింది. కేరళ బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ఓ అనుమానం వచ్చింది. సురేశ్గోపీ తెలుపు, బూడిదరంగు గుబురు గడ్డం, నల్లటి మీసాలను చూసి వెంకయ్యనాయుడు మాస్క్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారు.
వెంటనే సురేశ్గోపీని.. ‘మీది గడ్డమా? లేక అది మాస్కా?’ అని ప్రశ్నించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. వెంకయ్యనాయుడు అడిగిన ప్రశ్నకు సురేశ్ గోపి మొదట ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే నాది గడ్డమే అని సమాధానమిచ్చారు. తదుపరి చిత్రం కోసం ఇలా గడ్డం పెంచానని, ఇది న్యూలుక్ అని చెప్పారు. సురేశ్ గోపీ సమాధానంతో సంతృప్తి చెందిన వెంకయ్యనాయుడు..ఇక ప్రసంగించండి అని సిగ్నల్ ఇచ్చారు.
A lighter moment in the Rajya Sabha pic.twitter.com/lQH5g0wO4U
— Mohamed Imranullah S (@imranhindu) March 27, 2022