‘క్రాక్’ చిత్రంలో ప్రతినాయిక ఛాయలతో కూడిన పాత్రలో విలక్షణ నటనను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది వరలక్ష్మీ శరత్కుమార్. తాజాగా ఆమె ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకులు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఇటీవలే వరలక్ష్మీ శరత్కుమార్ ఈ సినిమా చిత్రీకరణలో భాగమయ్యారు. నిర్మాత మాట్లాడుతూ ‘థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో మధుబాలగా కీలక పాత్రలో వరలక్ష్మీ కనిపించబోతున్నది. ఈ నెల 23 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ను చిత్రీకరిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ, డా॥చల్లా భాగ్యలక్ష్మి, సంగీతం: మణిశర్మ.