చర్లపల్లి, జనవరి 8 : ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకొని.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, ప్రభుదాస్తో కలిసి ఆయ న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీకాతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని , 15నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని, వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమలో వైద్యులు సంపత్, స్వప్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, చర్లపల్లి, ఏఎస్రావునగర్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు గిరిబాబు, కాసం మహిపాల్రెడ్డి, అనిల్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, గంప కృష్ణ, వంశీరాజు, సర్ఫ్రాజ్, ఎస్కే కరీం, శ్రీని వాస్రెడ్డి, ఎస్ఏ రహీం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.