జూబ్లీహిల్స్,జనవరి6: రేపటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉండటంతో విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేశారు. గురు, శుక్రవారాల్లో ఆయా పాఠశాలల్లో వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధిలోని శ్రీరాంనగర్, జూబ్లీహిల్స్, వినాయక్నాగర్, బోరబండ పీహెచ్సీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ అమీర్, డాక్టర్ అశ్రిత, డాక్టర్ జువేరియా, డాక్టర్ శ్రీవల్లి బృందాలు పీహెచ్సీల పరిధిలోని పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 15 నుంచి 18 ఏండ్ల విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ తెలిపారు.