డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కర్ఫ్యూను ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు పొడగించింది. అయితే, సడలింపు సమయాల్లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపింది. ఇంతకు ముందు ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి సడలింపులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు వంద శాతం సామర్థ్యంతో పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు, వారంలో ఆరు రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగా.. సోమవారం నుంచి పది, ఇంటర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభయ్యాయి. ఈ నెల 16 నుంచి ఆరు, ఎనిమిది తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎస్ఓపీలు విడుదల చేసింది. అన్ని పాఠశాలలు కొవిడ్ ప్రోటోకాల్స్ను కచ్చితంగా పాటించాలని విద్యా మంత్రి అరవింద్ పాండే ఆదేశించారు.