వైష్ణవ్ తేజ్-కృతిశెట్టి లాంటి కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమా మైత్రీమూవీ మేకర్స్ ఖాతాలో మరో భారీ హిట్ను వేసింది. బాక్సాపీస్ మ్యూజికల్ హిట్గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. ఉప్పెన 50 కోట్లకుపైగా షేర్ ను రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సంస్థకు భారీ విజయాన్ని అందించిన హీరోహీరోయిన్లకు అదనంగా ఖరీదైన కానుకలను ఇచ్చారని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
ఉప్పెన విజయాన్ని అందరితో పంచుకునేందుకు మార్చి 18న హైదరాబాద్లో సెలబ్రేషన్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. టీం సభ్యులందరితోపాటు స్పెషల్ గెస్ట్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగం కాబోతున్నారట. మరి స్పెషల్ గెస్ట్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. మైత్రీమూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.