మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 27 : మహబూబాబాద్ పట్టణంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే శంకర్నాయక్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వాముల నగర సంకీర్తన కనులపండువగా సాగింది. మాలధారులందరూ జిల్లా కేంద్రంలోని శివాలయం గుడి నుంచి పలు కాలనీల మీదుగా హంస వాహనంతో అయ్యప్ప నగర సంకీర్తన ర్యాలీని నిర్వహించారు.
ప్రత్యేక నృత్యాలు, పాటల ద్వారా అయ్యప్ప స్వాములు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి, సూర్యచంద్ర, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, సంజీవ్ నంబూద్రి గురుస్వామి, గద్దె రవి, చిట్యాల జనార్దన్, గుగులోత్ బాలు, మందుల రఘు, రమేశ్ పాల్గొన్నారు.