హైదరాబాద్ : శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరన్ను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లోని స్టేట్ మ్యూజియం బుద్ధిస్ట్ కల్చర్ గ్యాలరీలో కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి మ్యూజియాన్ని సందర్శించారు. ఆ తర్వాత లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్ జలాశయంలోని ఆర్యతార క్రూస్ బోటులో ప్రయాణించారు. సాగర్లో 72 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ భూదయ్య, సూపర్వైజర్ బాబుల్ రెడ్డి, బోట్ కెప్టెన్ క్రాంతి, గైడ్ జానీ, లక్ష్మన్, మహేందర్, ప్రేమ్ శ్రీరాములు, టూరిజం సిబ్బంది ఉన్నారు.